Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:02 AM

యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన – అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన – అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన – అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
20-01-2026 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం (20-01-2026) యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని పలు కీలక పనులకు శ్రీకారం చుట్టనున్నారు.ఉదయం 9.30 గంటలకు యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు అంగన్వాడీ భవనాలను ప్రారంభించి, గ్రామీణ విద్యా మౌలిక వసతుల బలోపేతానికి తమ కట్టుబాటును చాటనున్నారు.ఉదయం 11 గంటలకు సైదాపూర్ గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనుండగా, 11.30 గంటలకు యాదగిరిగుట్ట మున్సిపల్ కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఇది మరింత ఊతమివ్వనుంది.మధ్యాహ్నం 12.30 గంటలకు ఆలేరు మున్సిపల్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తో కలిసి మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, విద్యుత్ మౌలిక వసతుల విస్తరణకు బాటలు వేయనున్నారు.ఇదే రోజున మంత్రి పలు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్షించనున్నారు. జిల్లాలో అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికార వర్గాలు తెలిపాయి.

Sthanikam

యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన – అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం (20-01-2026) యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని పలు కీలక పనులకు శ్రీకారం చుట్టనున్నారు.ఉదయం 9.30 గంటలకు యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు అంగన్వాడీ భవనాలను ప్రారంభించి, గ్రామీణ విద్యా మౌలిక వసతుల బలోపేతానికి తమ కట్టుబాటును చాటనున్నారు.ఉదయం 11 గంటలకు సైదాపూర్ గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనుండగా, 11.30 గంటలకు యాదగిరిగుట్ట మున్సిపల్ కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఇది మరింత ఊతమివ్వనుంది.మధ్యాహ్నం 12.30 గంటలకు ఆలేరు మున్సిపల్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తో కలిసి మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, విద్యుత్ మౌలిక వసతుల విస్తరణకు బాటలు వేయనున్నారు.ఇదే రోజున మంత్రి పలు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్షించనున్నారు. జిల్లాలో అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికార వర్గాలు తెలిపాయి.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News