Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:55 PM

యాదాద్రి ఆలయంలో చేతివాటం బంగారం వెండి డాలర్లు మాయం

యాదాద్రి ఆలయంలో చేతివాటం బంగారం వెండి డాలర్లు మాయం

యాదాద్రి ఆలయంలో చేతివాటం బంగారం వెండి డాలర్లు మాయం
January 29, 2026 12:06 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

రూ.22 లక్షల విలువైన బంగారం–వెండి డాలర్లు మాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో మరోసారి ఇంటి దొంగల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆలయ ప్రచార శాఖ ద్వారా విక్రయించే బంగారం, వెండి డాలర్లు భారీగా మాయమైనట్టు అధికారులు ఆడిట్‌లో ధృవీకరించారు. ఈ ఘటనలో సుమారు రూ.22 లక్షల విలువైన ఆలయ డాలర్లు గల్లంతైనట్టు తేలింది.

ఇటీవల నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చేతివాటమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. డాలర్ల నిల్వలు, విక్రయ లెక్కల్లో తీవ్ర వ్యత్యాసాలు బయటపడటంతో విచారణకు ఆదేశించారు.

ఇది తొలిసారి కాదు. గతంలోనూ ప్రసాదాల తయారీ కేంద్రంలో చింతపండు ఎత్తుకెళ్లిన ఘటన, అలాగే ప్రసాదాల అమ్మకాలలో అవకతవకలకు పాల్పడిన సిబ్బంది వ్యవహారాలు ఆలయ ప్రతిష్ఠకు మచ్చతెచ్చాయి. అయినా సరే, ఇటువంటి ఘటనలు పునరావృతం కావడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

నిత్యం చిన్నచిన్న చేతివాటాలతో ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న ఇంటి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయల విరాళాలతో నడిచే ప్రముఖ ఆలయంలో భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈసారి అయినా చర్యలు కనిపిస్తాయా? అన్న ప్రశ్న భక్తుల్లో మిగిలిపోయింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News