Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:21 AM

యాదాద్రి ఆలయంలో చేతివాటం బంగారం వెండి డాలర్లు మాయం

యాదాద్రి ఆలయంలో చేతివాటం బంగారం వెండి డాలర్లు మాయం

యాదాద్రి ఆలయంలో చేతివాటం బంగారం వెండి డాలర్లు మాయం
January 29, 2026 12:06 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

రూ.22 లక్షల విలువైన బంగారం–వెండి డాలర్లు మాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో మరోసారి ఇంటి దొంగల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆలయ ప్రచార శాఖ ద్వారా విక్రయించే బంగారం, వెండి డాలర్లు భారీగా మాయమైనట్టు అధికారులు ఆడిట్‌లో ధృవీకరించారు. ఈ ఘటనలో సుమారు రూ.22 లక్షల విలువైన ఆలయ డాలర్లు గల్లంతైనట్టు తేలింది.

ఇటీవల నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చేతివాటమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. డాలర్ల నిల్వలు, విక్రయ లెక్కల్లో తీవ్ర వ్యత్యాసాలు బయటపడటంతో విచారణకు ఆదేశించారు.

ఇది తొలిసారి కాదు. గతంలోనూ ప్రసాదాల తయారీ కేంద్రంలో చింతపండు ఎత్తుకెళ్లిన ఘటన, అలాగే ప్రసాదాల అమ్మకాలలో అవకతవకలకు పాల్పడిన సిబ్బంది వ్యవహారాలు ఆలయ ప్రతిష్ఠకు మచ్చతెచ్చాయి. అయినా సరే, ఇటువంటి ఘటనలు పునరావృతం కావడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

నిత్యం చిన్నచిన్న చేతివాటాలతో ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న ఇంటి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయల విరాళాలతో నడిచే ప్రముఖ ఆలయంలో భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈసారి అయినా చర్యలు కనిపిస్తాయా? అన్న ప్రశ్న భక్తుల్లో మిగిలిపోయింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News