యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు స్వీకరించిన అక్షాంశ్ యాదవ్ ఐపీఎస్ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏటెల్లీ పరమేశ్, బత్తుల నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భద్రతాభావం కల్పించేలా సమర్థవంతమైన పోలీసింగ్ కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా స్పందించిన జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, చట్టపాలనకు కట్టుబడి ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచేలా పనిచేస్తామని తెలిపారు. ప్రజా భద్రతే లక్ష్యంగా పారదర్శక, బాధ్యతాయుత పోలీసింగ్ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి