వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
Biksham
మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ని పెన్ పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన వసతులు, పంటల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పనపై చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ మార్కెట్ ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు అందేలా కృషి చేస్తామని కొప్పుల వేణారెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. గాజుల మల్కాపురం గ్రామ అభివృద్ధికి అవసరమైన సహకారం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి