Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

వృధాగా పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు

వృధాగా పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు

వృధాగా  పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు
January 26, 2026 08:58 PM 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన నిత్యం కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని హైస్కూల్ ప్రక్కన వనిపాకల రోడ్డు మూల వద్ద ప్రతిరోజూ భారీగా తాగునీరు వృథాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై ఇప్పటికే ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి విన్నవించుకున్నా, వీడియోలు విడుదల చేసినా ఎలాంటి స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. అక్కడ వృథాగా పోతున్న నీటి పరిమాణం ఒక రైతు తన పొలానికి మలుపు పెడితే దాదాపు రెండు ఎకరాలకు సరిపడేంత నీరని స్థానికులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకునే నాధుడే లేడని, సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఉన్న చోట మాత్రం లక్షల లీటర్ల నీరు వృథాగా పోవడం బాధాకరమని వారు అంటున్నారు.

కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, పైపులైన్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టి తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News