Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:26 AM

వృధాగా పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు

వృధాగా పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు

వృధాగా  పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు
January 26, 2026 08:58 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన నిత్యం కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని హైస్కూల్ ప్రక్కన వనిపాకల రోడ్డు మూల వద్ద ప్రతిరోజూ భారీగా తాగునీరు వృథాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై ఇప్పటికే ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి విన్నవించుకున్నా, వీడియోలు విడుదల చేసినా ఎలాంటి స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. అక్కడ వృథాగా పోతున్న నీటి పరిమాణం ఒక రైతు తన పొలానికి మలుపు పెడితే దాదాపు రెండు ఎకరాలకు సరిపడేంత నీరని స్థానికులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకునే నాధుడే లేడని, సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఉన్న చోట మాత్రం లక్షల లీటర్ల నీరు వృథాగా పోవడం బాధాకరమని వారు అంటున్నారు.

కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, పైపులైన్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టి తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News