Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:47 PM

వృధాగా పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు

వృధాగా పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు

వృధాగా  పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు
26-01-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన నిత్యం కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని హైస్కూల్ ప్రక్కన వనిపాకల రోడ్డు మూల వద్ద ప్రతిరోజూ భారీగా తాగునీరు వృథాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై ఇప్పటికే ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి విన్నవించుకున్నా, వీడియోలు విడుదల చేసినా ఎలాంటి స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. అక్కడ వృథాగా పోతున్న నీటి పరిమాణం ఒక రైతు తన పొలానికి మలుపు పెడితే దాదాపు రెండు ఎకరాలకు సరిపడేంత నీరని స్థానికులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకునే నాధుడే లేడని, సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఉన్న చోట మాత్రం లక్షల లీటర్ల నీరు వృథాగా పోవడం బాధాకరమని వారు అంటున్నారు.

కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, పైపులైన్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టి తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

వృధాగా పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు

Article Image

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన నిత్యం కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని హైస్కూల్ ప్రక్కన వనిపాకల రోడ్డు మూల వద్ద ప్రతిరోజూ భారీగా తాగునీరు వృథాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై ఇప్పటికే ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి విన్నవించుకున్నా, వీడియోలు విడుదల చేసినా ఎలాంటి స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. అక్కడ వృథాగా పోతున్న నీటి పరిమాణం ఒక రైతు తన పొలానికి మలుపు పెడితే దాదాపు రెండు ఎకరాలకు సరిపడేంత నీరని స్థానికులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకునే నాధుడే లేడని, సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఉన్న చోట మాత్రం లక్షల లీటర్ల నీరు వృథాగా పోవడం బాధాకరమని వారు అంటున్నారు.

కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, పైపులైన్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టి తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News