వృధాగా పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు
వృధాగా పోతున్న త్రాగునీరు పట్టించుకోని చిట్యాల మున్సిపల్ అధికారులు
Komidala Mahender reddy
చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన నిత్యం కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని హైస్కూల్ ప్రక్కన వనిపాకల రోడ్డు మూల వద్ద ప్రతిరోజూ భారీగా తాగునీరు వృథాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై ఇప్పటికే ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి విన్నవించుకున్నా, వీడియోలు విడుదల చేసినా ఎలాంటి స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. అక్కడ వృథాగా పోతున్న నీటి పరిమాణం ఒక రైతు తన పొలానికి మలుపు పెడితే దాదాపు రెండు ఎకరాలకు సరిపడేంత నీరని స్థానికులు చెబుతున్నారు.
ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకునే నాధుడే లేడని, సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఉన్న చోట మాత్రం లక్షల లీటర్ల నీరు వృథాగా పోవడం బాధాకరమని వారు అంటున్నారు.
కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, పైపులైన్కు తక్షణమే మరమ్మతులు చేపట్టి తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి