Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:10 AM

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్
January 12, 2026 04:32 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ:

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్యసాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. యువత ఒకే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి ముందుకు సాగాలని, దేశభక్తిని జీవిత విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.వివేకానంద బోధనలను ఆచరణలో పెట్టేందుకు డివైఎఫ్ఐ యువతను చైతన్యం చేస్తూ గంజాయి, డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉండేలా అవగాహన సదస్సులు, సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతగా సేవా భావంతో పనిచేయాలని, త్యాగం, సేవా గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద మాటలను ఆచరించి సన్మార్గంలో ప్రయాణించినప్పుడే సమాజానికి మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, నాయకులు కత్తుల లింగస్వామి, నాతి నరేష్, వేణు, రాము, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News