Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:37 AM

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్
January 12, 2026 04:32 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ:

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్యసాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. యువత ఒకే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి ముందుకు సాగాలని, దేశభక్తిని జీవిత విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.వివేకానంద బోధనలను ఆచరణలో పెట్టేందుకు డివైఎఫ్ఐ యువతను చైతన్యం చేస్తూ గంజాయి, డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉండేలా అవగాహన సదస్సులు, సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతగా సేవా భావంతో పనిచేయాలని, త్యాగం, సేవా గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద మాటలను ఆచరించి సన్మార్గంలో ప్రయాణించినప్పుడే సమాజానికి మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, నాయకులు కత్తుల లింగస్వామి, నాతి నరేష్, వేణు, రాము, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News