Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:11 AM

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్
12-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ:

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్యసాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. యువత ఒకే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి ముందుకు సాగాలని, దేశభక్తిని జీవిత విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.వివేకానంద బోధనలను ఆచరణలో పెట్టేందుకు డివైఎఫ్ఐ యువతను చైతన్యం చేస్తూ గంజాయి, డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉండేలా అవగాహన సదస్సులు, సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతగా సేవా భావంతో పనిచేయాలని, త్యాగం, సేవా గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద మాటలను ఆచరించి సన్మార్గంలో ప్రయాణించినప్పుడే సమాజానికి మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, నాయకులు కత్తుల లింగస్వామి, నాతి నరేష్, వేణు, రాము, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్

Article Image
నల్గొండ:

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్యసాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. యువత ఒకే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి ముందుకు సాగాలని, దేశభక్తిని జీవిత విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.వివేకానంద బోధనలను ఆచరణలో పెట్టేందుకు డివైఎఫ్ఐ యువతను చైతన్యం చేస్తూ గంజాయి, డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉండేలా అవగాహన సదస్సులు, సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతగా సేవా భావంతో పనిచేయాలని, త్యాగం, సేవా గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద మాటలను ఆచరించి సన్మార్గంలో ప్రయాణించినప్పుడే సమాజానికి మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, నాయకులు కత్తుల లింగస్వామి, నాతి నరేష్, వేణు, రాము, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News