వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్
వివేకానంద బోధనలు ఆచరించి యువత సన్మార్గంలో నడవాలి: మల్లం మహేష్
Editor Desk
నల్గొండ:
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్యసాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. యువత ఒకే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి ముందుకు సాగాలని, దేశభక్తిని జీవిత విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.వివేకానంద బోధనలను ఆచరణలో పెట్టేందుకు డివైఎఫ్ఐ యువతను చైతన్యం చేస్తూ గంజాయి, డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉండేలా అవగాహన సదస్సులు, సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతగా సేవా భావంతో పనిచేయాలని, త్యాగం, సేవా గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద మాటలను ఆచరించి సన్మార్గంలో ప్రయాణించినప్పుడే సమాజానికి మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, నాయకులు కత్తుల లింగస్వామి, నాతి నరేష్, వేణు, రాము, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి