Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:29 AM

విజయనగరంపై ఖాదర్ బాబా ఆశీస్సులు నిలవాలి: కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరంపై ఖాదర్ బాబా ఆశీస్సులు నిలవాలి: కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరంపై ఖాదర్ బాబా ఆశీస్సులు నిలవాలి: కోలగట్ల వీరభద్రస్వామి
January 29, 2026 09:24 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
విజయనగరం స్థానికం ప్రధాన ప్రతినిధి

విజయనగర ప్రజలపై హుజూర్ హజరత్ బాబా ఖాదర్ అవులియా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆకాంక్షించారు. గురువారం బాబామెట్టలో నిర్వహించిన ఖాదర్ బాబా అవులియా 67వ ఉరుసు మహోత్సవాలకు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు.కోలగట్ల వీరభద్రస్వామి రాక సందర్భంగా దర్గా యాజమాన్యం మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ వేషధారణలతో ఘన స్వాగతం పలికింది. అనంతరం బాబా చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి విజయనగర ప్రజలపై బాబా ఆశీస్సులు నిలవాలని ప్రార్థించారు. అలాగే పార్టీ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనను సత్కరించారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఖాదర్ బాబా దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని కోలగట్ల పేర్కొన్నారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు దర్గాను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. కుల, మత భేదాలు లేకుండా సమానత్వాన్ని చాటే వేదికగా ఖాదర్ బాబా దర్గా విరాజిల్లుతోందని అన్నారు. మూడు రోజుల ఉరుసు మహోత్సవాలకే పరిమితం కాకుండా నిత్య అన్నదానం నిర్వహిస్తున్న దర్గా యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం రెడ్డి బంగారు నాయుడు, ఫ్లోర్ లీడర్ ఎస్.వి.వి. రాజేష్, నియోజకవర్గ యువజన–విద్యార్థి విభాగాల ఇంచార్జ్ కౌశిక్ ఈశ్వర్, స్థానిక కార్పొరేటర్లు, యువజన విభాగ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News