Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:29 PM

వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
January 31, 2026 06:09 PM 524 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ 06వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిర్రబోయిన రమేష్, భగవాన్ దాస్, యల్లయ్య, జక్కల నర్సింహ, చిర్రబోయిన నర్సింహ, అంజయ్య, మెండే నర్సింహ, లింగస్వామి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్నే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. రానున్న చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల మధ్య ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఇంటికీ కాంగ్రెస్ పాలన ఫలాలు చేరేలా పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News