వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ 06వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిర్రబోయిన రమేష్, భగవాన్ దాస్, యల్లయ్య, జక్కల నర్సింహ, చిర్రబోయిన నర్సింహ, అంజయ్య, మెండే నర్సింహ, లింగస్వామి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్నే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. రానున్న చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల మధ్య ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఇంటికీ కాంగ్రెస్ పాలన ఫలాలు చేరేలా పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి