Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:57 AM

వెల్లంకిలో జాతీయ స్పూర్తికి అద్దం పట్టిన గణతంత్ర వేడుకలు

వెల్లంకిలో జాతీయ స్పూర్తికి అద్దం పట్టిన గణతంత్ర వేడుకలు

వెల్లంకిలో జాతీయ స్పూర్తికి అద్దం పట్టిన గణతంత్ర వేడుకలు
26-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలతో జాతీయ భావోద్వేగాలకు అద్దం పట్టింది. గ్రామపంచాయతీ భవనం ఎదుట గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.గ్రామంలో దేశభక్తి నినాదాలతో వాతావరణం మార్మోగగా, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నూతన వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు ఘనత చేకూర్చారు.

గణతంత్ర దినోత్సవాన్ని విద్యాభివృద్ధితో ముడిపెడుతూ గ్రామ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆన్‌లైన్ విద్యకు సహకారంగా బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎడ్ల నరేందర్ రెడ్డి ముప్పై వేల రూపాయల విలువైన టీవీని విరాళంగా అందించారు. ఈ టీవీని గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sthanikam

వెల్లంకిలో జాతీయ స్పూర్తికి అద్దం పట్టిన గణతంత్ర వేడుకలు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలతో జాతీయ భావోద్వేగాలకు అద్దం పట్టింది. గ్రామపంచాయతీ భవనం ఎదుట గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.గ్రామంలో దేశభక్తి నినాదాలతో వాతావరణం మార్మోగగా, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నూతన వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు ఘనత చేకూర్చారు.

గణతంత్ర దినోత్సవాన్ని విద్యాభివృద్ధితో ముడిపెడుతూ గ్రామ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆన్‌లైన్ విద్యకు సహకారంగా బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎడ్ల నరేందర్ రెడ్డి ముప్పై వేల రూపాయల విలువైన టీవీని విరాళంగా అందించారు. ఈ టీవీని గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News