వెల్లంకిలో జాతీయ స్పూర్తికి అద్దం పట్టిన గణతంత్ర వేడుకలు
వెల్లంకిలో జాతీయ స్పూర్తికి అద్దం పట్టిన గణతంత్ర వేడుకలు
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలతో జాతీయ భావోద్వేగాలకు అద్దం పట్టింది. గ్రామపంచాయతీ భవనం ఎదుట గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.గ్రామంలో దేశభక్తి నినాదాలతో వాతావరణం మార్మోగగా, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నూతన వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలకు ఘనత చేకూర్చారు.
గణతంత్ర దినోత్సవాన్ని విద్యాభివృద్ధితో ముడిపెడుతూ గ్రామ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆన్లైన్ విద్యకు సహకారంగా బీఆర్ఎస్ యువ నాయకుడు ఎడ్ల నరేందర్ రెడ్డి ముప్పై వేల రూపాయల విలువైన టీవీని విరాళంగా అందించారు. ఈ టీవీని గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి