వెల్లంకి గ్రామంలో ప్రభుత్వ పనులపై అదిత్య ప్రకాష్ ఐఏఎస్ తనిఖీ
వెల్లంకి గ్రామంలో ప్రభుత్వ పనులపై అదిత్య ప్రకాష్ ఐఏఎస్ తనిఖీ
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామాన్ని పంచాయతీ రాజ్ శాఖ అడిషనల్ సెక్రటరీ (బీహార్ రాష్ట్రం) ఆదిత్య ప్రకాష్ ఐఏఎస్ సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, రైతు వేదిక, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీ తదితర అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, హరిత కార్యక్రమాలు, ప్రజాపయోగ పనుల అమలు మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఈ తనిఖీ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (పంచాయతీ రాజ్) జాన్ వెస్లీ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, అడిషనల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, మండల పంచాయతీ అధికారి రావుఫ్ అలీ, సర్పంచ్ ఇడం రాధ శ్రీనివాస్, ఏఈ పీఆర్ సందీప్ రెడ్డి, ఏపీఓ వెంకన్న, ఈసీ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి మోహన్, టీఏ సుచరిత, వార్డ్ మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి