Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:04 AM

వెంకటరమణ కాలనీ సమస్యలపై కార్పొరేటర్‌కు వినతి

వెంకటరమణ కాలనీ సమస్యలపై కార్పొరేటర్‌కు వినతి

వెంకటరమణ కాలనీ సమస్యలపై కార్పొరేటర్‌కు వినతి
18-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వెంకటరమణ కాలనీ వాసులు మంగళవారం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి తమ కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

కాలనీలో ఇంకా పెండింగ్‌లో ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులు, రోడ్ నంబర్–7లో డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు, తాగునీటి పైప్‌లైన్ సమస్యతో పాటు కాలనీ అమ్మవారి ఆలయం ముందు వర్షాకాలంలో తరచూ ఏర్పడుతున్న నీరు నిలిచిపోవడం (వాటర్ లాగింగ్) సమస్యలపై కాలనీ వాసులు వివరించారు.

ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న కార్పొరేటర్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, పేర్కొన్న పనులను అత్యవసరంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాలనీ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైన నిధులు, సాంకేతిక సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో వెంకటరమణ కాలనీ అధ్యక్షుడు యాదవ రెడ్డితో పాటు పలువురు కాలనీ నివాసితులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.

Sthanikam

వెంకటరమణ కాలనీ సమస్యలపై కార్పొరేటర్‌కు వినతి

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వెంకటరమణ కాలనీ వాసులు మంగళవారం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి తమ కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

కాలనీలో ఇంకా పెండింగ్‌లో ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులు, రోడ్ నంబర్–7లో డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు, తాగునీటి పైప్‌లైన్ సమస్యతో పాటు కాలనీ అమ్మవారి ఆలయం ముందు వర్షాకాలంలో తరచూ ఏర్పడుతున్న నీరు నిలిచిపోవడం (వాటర్ లాగింగ్) సమస్యలపై కాలనీ వాసులు వివరించారు.

ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న కార్పొరేటర్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, పేర్కొన్న పనులను అత్యవసరంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాలనీ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైన నిధులు, సాంకేతిక సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో వెంకటరమణ కాలనీ అధ్యక్షుడు యాదవ రెడ్డితో పాటు పలువురు కాలనీ నివాసితులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News