PRINT TIME: May 26, 2026 04:32 PM
వేద పాఠశాల భూమి పూజకు మంత్రి వెంకట్రెడ్డికి ఆహ్వానం
వేద పాఠశాల భూమి పూజకు మంత్రి వెంకట్రెడ్డికి ఆహ్వానం
May 20, 2026 09:12 PM
23 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 23న నిర్వహించనున్న వేద పాఠశాల భూమి పూజ, దేవస్థాన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆలయ ఈవో భవాని శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు రాజన్బాబు, సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి