వీబీజీరామ్జీ చట్టంతో కూలీలకు నష్టం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు.
వీబీజీరామ్జీ చట్టంతో కూలీలకు నష్టం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు.
Editor Desk
ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తున్నారు.
: గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు విమర్శించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం మూడవ మహాసభలు మంగళవారం రామన్నపేటలోని ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఒళ్ళు యాదగిరి జెండా ఆవిష్కరణ చేసి మహాసభలను ప్రారంభించారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టానికి సరిపడా నిధులు కేటాయించకుండా పని దినాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. కేంద్రం తీసుకురానున్న వీబీజీరామ్జీ చట్టం అమల్లోకి వస్తే ఉపాధి కూలీల హక్కులు మరింత క్షీణించే ప్రమాదం ఉందన్నారు.
కాంట్రాక్టర్ల పెత్తనం, యంత్రాల వినియోగం పెరిగి గ్రామీణ నిరుద్యోగం అధికమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకునేందుకు వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలకు సంఘీభావంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడి సౌహర్థ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు గొరిగే సోములు, బొడ్డుపల్లి వెంకటేశం, వ్యకాస మండల అధ్యక్ష, కార్యదర్శులు మేడి ముకుంద,కందుల హనుమంతు,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గంటెపాక శివ కుమార్,ఈర్లపల్లి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి