వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి
వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి
Editor Desk
నల్గొండ: రాష్ట్ర వారసత్వ, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారసత్వ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని పానగల్లు మ్యూజియంలో సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పర్యాటకులు, విద్యార్థులు, చరిత్రాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు. సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మ్యూజియం సిబ్బంది ఎండీ గౌస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వారసత్వ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వారసత్వ శాఖ సంచాలకులు అర్జున్ రావు, అదనపు సంచాలకులు నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, యువత, పర్యాటకులు, చరిత్రాభిమానులు కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
వారోత్సవాల షెడ్యూల్
మే 20 : హెరిటేజ్ వాక్
మే 21 : హెరిటేజ్ వాక్, ప్రత్యేక కార్యక్రమాలు, పోస్టల్ కవర్ ఆవిష్కరణ
మే 22 : ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం
మే 23 : ముగింపు వేడుకలు
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజల్లో చారిత్రక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి