Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:52 AM

వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి

వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి

వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి
May 20, 2026 09:16 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: రాష్ట్ర వారసత్వ, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారసత్వ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని పానగల్లు మ్యూజియంలో సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పర్యాటకులు, విద్యార్థులు, చరిత్రాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు. సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మ్యూజియం సిబ్బంది ఎండీ గౌస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వారసత్వ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వారసత్వ శాఖ సంచాలకులు అర్జున్ రావు, అదనపు సంచాలకులు నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, యువత, పర్యాటకులు, చరిత్రాభిమానులు కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

వారోత్సవాల షెడ్యూల్

మే 20 : హెరిటేజ్ వాక్

మే 21 : హెరిటేజ్ వాక్‌, ప్రత్యేక కార్యక్రమాలు, పోస్టల్ కవర్ ఆవిష్కరణ

మే 22 : ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం

మే 23 : ముగింపు వేడుకలు

వారసత్వ సంపదను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజల్లో చారిత్రక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News