Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:56 AM

వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి

వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి

వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి
20-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: రాష్ట్ర వారసత్వ, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారసత్వ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని పానగల్లు మ్యూజియంలో సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పర్యాటకులు, విద్యార్థులు, చరిత్రాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు. సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మ్యూజియం సిబ్బంది ఎండీ గౌస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వారసత్వ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వారసత్వ శాఖ సంచాలకులు అర్జున్ రావు, అదనపు సంచాలకులు నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, యువత, పర్యాటకులు, చరిత్రాభిమానులు కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

వారోత్సవాల షెడ్యూల్

మే 20 : హెరిటేజ్ వాక్

మే 21 : హెరిటేజ్ వాక్‌, ప్రత్యేక కార్యక్రమాలు, పోస్టల్ కవర్ ఆవిష్కరణ

మే 22 : ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం

మే 23 : ముగింపు వేడుకలు

వారసత్వ సంపదను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజల్లో చారిత్రక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

వారసత్వ సంపదకు ఉచిత దర్శనం. పానగల్లు మ్యూజియంలో సందర్శకుల సందడి

Article Image

నల్గొండ: రాష్ట్ర వారసత్వ, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారసత్వ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని పానగల్లు మ్యూజియంలో సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పర్యాటకులు, విద్యార్థులు, చరిత్రాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు. సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మ్యూజియం సిబ్బంది ఎండీ గౌస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వారసత్వ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వారసత్వ శాఖ సంచాలకులు అర్జున్ రావు, అదనపు సంచాలకులు నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, యువత, పర్యాటకులు, చరిత్రాభిమానులు కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

వారోత్సవాల షెడ్యూల్

మే 20 : హెరిటేజ్ వాక్

మే 21 : హెరిటేజ్ వాక్‌, ప్రత్యేక కార్యక్రమాలు, పోస్టల్ కవర్ ఆవిష్కరణ

మే 22 : ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం

మే 23 : ముగింపు వేడుకలు

వారసత్వ సంపదను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ప్రజల్లో చారిత్రక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News