Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:09 AM

వనస్థలిపురం డివిజన్‌లో డ్రైనేజీ మౌలిక వసతుల బలోపేతం

వనస్థలిపురం డివిజన్‌లో డ్రైనేజీ మౌలిక వసతుల బలోపేతం

వనస్థలిపురం డివిజన్‌లో డ్రైనేజీ మౌలిక వసతుల బలోపేతం
January 10, 2026 02:25 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సద్గురు నగర్‌లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అడుగు

వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని సద్గురు నగర్ కాలనీలో డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమాన్ని వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సద్గురు నగర్ కాలనీలో ఏళ్లుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పైప్‌లైన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని, కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో కర్మాన్‌ఘాట్ దేవాలయం డైరెక్టర్ కవిత, వర్క్ ఇన్‌స్పెక్టర్ సతీష్ రెడ్డి, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. అలాగే సద్గురు నగర్ కాలనీ అధ్యక్షుడు సంజీవయ్య, జనరల్ సెక్రటరీ రామారావు, ఉమాపతి, నవీన్, వంశీతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

డ్రైనేజీ పనులు పూర్తయితే కాలనీలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయని, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News