వనస్థలిపురం నాగార్జున కాలనీలో పైప్లైన్ పనుల ప్రారంభం
వనస్థలిపురం నాగార్జున కాలనీలో పైప్లైన్ పనుల ప్రారంభం
Editor Desk
నాగార్జున కాలనీలో పైప్లైన్ పనులకు శుభారంభం
వనస్థలిపురం స్థానికం ప్రతినిధి
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని నాగార్జున కాలనీలో పైప్లైన్ పనులకు ఈరోజు శుభారంభం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి కొబ్బరి కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున కాలనీ అధ్యక్షుడు ఈ. చంద్ర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మేకల లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ వి. రామ్ కృష్ణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డి. చంద్రశేఖర్, బాలరాజ్ గౌడ్, జక్కిడి సురేందర్ రెడ్డి, ఎం. రమేష్, బిక్షం రెడ్డి, ఎం. కరుణాకర్ రెడ్డి, కిరణ్ కుమార్, మాజీ అధ్యక్షుడు జి. నర్సింహ రెడ్డి, క్రిస్టియన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, ఏఈ కుమారి భావ్య, గుంటి జంగయ్య కాలనీ నివాసి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ కాలనీ అభివృద్ధికి మరిన్ని మౌలిక సదుపాయాల పనులు చేపట్టాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి