PRINT TIME: April 10, 2026 01:25 PM
వలిగొండలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
వలిగొండలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
January 26, 2026 08:45 PM
14 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వలిగొండ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాజ్యాంగ విలువలు, దేశభక్తి ప్రాముఖ్యతపై ప్రసంగాలు చేశారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కొండూరు అజయ్ గౌడ్, మునుకుంట్ల ధనంజయ గౌడ్, బత్తిని లింగయ్య, కొండూరు వెంకటేశం, పంజాల రమేష్, బంధారపు లింగస్వామి, నాగేష్, వెంకటరమణ, రంజిత్, సురేష్, సత్యనారాయణ, బిక్షపతి, నరేష్, శేఖర్లతో పాటు గ్రామ సర్పంచ్ వెంకట్ పాపి రెడ్డి గారు మరియు సంఘ పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం దేశానికి గర్వకారణమని, ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం జాతీయ గీతంతో ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి