వలిగొండ స్థానికం / ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జలంధర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి దశరథ నాయక్, మండల పంచాయతీ అధికారి సైద అర్జుమన్ బాను కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నూతనంగా ఎన్నికైన వలిగొండ గ్రామ సర్పంచ్, వలిగొండ ఎస్ ఐ యుగంధర్, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్వాతంత్ర్య భావనలు, జాతీయ ఐక్యతను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి