Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:37 AM

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం
January 28, 2026 02:32 AM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్‌పల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి:

నార్కట్‌పల్లి పట్టణంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగియగా, గెలుపొందిన జట్లకు రేపు బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు పట్టణ వాలీబాల్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


ఈ సందర్భంగా మొదటి బహుమతిగా పది వేల రూపాయలను జింకల ఆనంద్ యశోద గార్లు అందజేయనుండగా, రెండో బహుమతిగా ఐదు వేల రూపాయలను పుల్లెంల మహేశ్ గౌడ, మేఘన గార్లు ప్రదానం చేయనున్నారు.

టోర్నమెంట్‌లో నార్కట్‌పల్లి బీసీ కాలనీ జట్టు ప్రథమ బహుమతిని సాధించి విజేతగా నిలవగా, ఎల్లారెడ్డిగూడెం జట్టు ద్వితీయ బహుమతితో సరిపెట్టుకుంది. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమం ఉండనున్నదని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News