Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:52 AM

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం
28-01-2026 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్‌పల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి:

నార్కట్‌పల్లి పట్టణంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగియగా, గెలుపొందిన జట్లకు రేపు బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు పట్టణ వాలీబాల్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


ఈ సందర్భంగా మొదటి బహుమతిగా పది వేల రూపాయలను జింకల ఆనంద్ యశోద గార్లు అందజేయనుండగా, రెండో బహుమతిగా ఐదు వేల రూపాయలను పుల్లెంల మహేశ్ గౌడ, మేఘన గార్లు ప్రదానం చేయనున్నారు.

టోర్నమెంట్‌లో నార్కట్‌పల్లి బీసీ కాలనీ జట్టు ప్రథమ బహుమతిని సాధించి విజేతగా నిలవగా, ఎల్లారెడ్డిగూడెం జట్టు ద్వితీయ బహుమతితో సరిపెట్టుకుంది. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమం ఉండనున్నదని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం

Article Image
నార్కట్‌పల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి:

నార్కట్‌పల్లి పట్టణంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగియగా, గెలుపొందిన జట్లకు రేపు బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు పట్టణ వాలీబాల్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


ఈ సందర్భంగా మొదటి బహుమతిగా పది వేల రూపాయలను జింకల ఆనంద్ యశోద గార్లు అందజేయనుండగా, రెండో బహుమతిగా ఐదు వేల రూపాయలను పుల్లెంల మహేశ్ గౌడ, మేఘన గార్లు ప్రదానం చేయనున్నారు.

టోర్నమెంట్‌లో నార్కట్‌పల్లి బీసీ కాలనీ జట్టు ప్రథమ బహుమతిని సాధించి విజేతగా నిలవగా, ఎల్లారెడ్డిగూడెం జట్టు ద్వితీయ బహుమతితో సరిపెట్టుకుంది. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమం ఉండనున్నదని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News