PRINT TIME: February 24, 2026 03:01 AM
వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం
వాలీబాల్ విజేతలకు రేపు ఘన సన్మానం
January 28, 2026 02:32 AM
63 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
నార్కట్పల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి:
నార్కట్పల్లి పట్టణంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగియగా, గెలుపొందిన జట్లకు రేపు బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు పట్టణ వాలీబాల్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మొదటి బహుమతిగా పది వేల రూపాయలను జింకల ఆనంద్ యశోద గార్లు అందజేయనుండగా, రెండో బహుమతిగా ఐదు వేల రూపాయలను పుల్లెంల మహేశ్ గౌడ, మేఘన గార్లు ప్రదానం చేయనున్నారు.
టోర్నమెంట్లో నార్కట్పల్లి బీసీ కాలనీ జట్టు ప్రథమ బహుమతిని సాధించి విజేతగా నిలవగా, ఎల్లారెడ్డిగూడెం జట్టు ద్వితీయ బహుమతితో సరిపెట్టుకుంది. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమం ఉండనున్నదని నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి