వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించండి.
వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించండి.
Biksham
సూర్యాపేట టౌన్ సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం సూర్యాపేట మున్సిపల్ 24వ వార్డు అభ్యర్థి వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ఓటర్లను కోరారు. బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట వన్ టౌన్ పరిధిలో కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గత 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసిన కార్మిక నాయకుడు సాయికుమార్ అన్నారు. సాయికుమార్ గెలిస్తే 24వ వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని అన్నారు. అవినీతి రహిత పాలన కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా పనిచేసే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ లో గల మెత్తుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 24వ వార్డు అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, పట్టణ కమిటీ సభ్యులు షేక్ సైదులు, నాయకులు ఆశాలు, కవిత, మంజుల, రేణుక పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి