Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 03:26 PM

విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
April 13, 2026 01:59 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


ముఖ్యమంత్రికి సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం బహిరంగ లేఖ..

న్యాయమైన డిమాండ్ల కోసం ఐదు రోజులుగా కొనసాగుతున్న సమ్మె..


​నల్గొండ : రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో దశాబ్దాలుగా వెలుగులు నింపుతున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం గత ఐదు రోజులుగా (ఏప్రిల్ 08 నుంచి) నిరవధిక సమ్మె బాట పట్టిన కార్మికులకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి సోమవారం ఒక బహిరంగ లేఖ రాస్తూ.. 20 వేల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్చలు జరపాలని కోరారు. గత ప్రభుత్వం 2017లో కార్మికులను రెగ్యులర్ చేస్తామని నమ్మబలికి తీరా సమయం వచ్చేసరికి పదోన్నతులు, సెలవులు ఇవ్వకుండా వంచించిందని ఆయన విమర్శించారు. సంస్థలోని సాధారణ ఉద్యోగులకు వర్తించే 'APSEB' నిబంధనలను కాదని ఆర్టిజన్ల కోసం ప్రత్యేకంగా 2020లో నిరంకుశంగా కొత్త సర్వీసు రూల్స్ తేవడం అన్యాయమని పేర్కొన్నారు. కనీసం త్రాగునీరు, వెలుతురు వంటి కనీస సదుపాయాలు లేని సబ్‌స్టేషన్లలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికుల ప్రధాన డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు. విద్యార్హత కలిగిన ప్రతి ఆర్టిజన్ కార్మికుడిని జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ లేదా సబ్ ఇంజనీర్లుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని అన్‌మ్యాన్డ్ వర్కర్లను, 2016 నుంచి చిన్నపాటి సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్న కార్మికులను తక్షణమే సంస్థలో విలీనం చేయాలని కోరారు. బిల్ రీడర్లు, కలెక్టర్లు, హమాలీలకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంతో పాటు, అందరికీ వర్తించేలా 'పీఆర్సీ-2026'ను ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.​ సమ్మె సుదీర్ఘంగా కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పరిస్థితి మరింత జటిలం కాకముందే ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News