Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

వైభవంగా హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి ఉర్సు ఉత్సవాలు

వైభవంగా హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి ఉర్సు ఉత్సవాలు

వైభవంగా హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి ఉర్సు ఉత్సవాలు
13-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కులమతాలకు అతీతంగా తరలిరానున్న భక్తులు

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. స్థానిక జాతీయ రహదారి (NH 65) పక్కనే కొలువై ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం (14-04-2026) నుండి బుధవారం (15-04-2026) వరకు రెండు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. దర్గా ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధం మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనలు, ఖవ్వాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ దర్గా అత్యంత మహత్యంగలదిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం విశేషం. ఈ ఉర్సు మహోత్సవానికి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉర్సు ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, బాబా వారి కృపకు పాత్రులు కావాలని దర్గా ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.

Sthanikam

వైభవంగా హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి ఉర్సు ఉత్సవాలు

Article Image

కులమతాలకు అతీతంగా తరలిరానున్న భక్తులు

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. స్థానిక జాతీయ రహదారి (NH 65) పక్కనే కొలువై ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం (14-04-2026) నుండి బుధవారం (15-04-2026) వరకు రెండు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. దర్గా ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధం మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనలు, ఖవ్వాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ దర్గా అత్యంత మహత్యంగలదిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం విశేషం. ఈ ఉర్సు మహోత్సవానికి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉర్సు ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, బాబా వారి కృపకు పాత్రులు కావాలని దర్గా ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News