వైభవంగా హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి ఉర్సు ఉత్సవాలు
వైభవంగా హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి ఉర్సు ఉత్సవాలు
K.RAVI
కులమతాలకు అతీతంగా తరలిరానున్న భక్తులు
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. స్థానిక జాతీయ రహదారి (NH 65) పక్కనే కొలువై ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం హజరత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాధిరి దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం (14-04-2026) నుండి బుధవారం (15-04-2026) వరకు రెండు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. దర్గా ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధం మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనలు, ఖవ్వాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ దర్గా అత్యంత మహత్యంగలదిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం విశేషం. ఈ ఉర్సు మహోత్సవానికి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉర్సు ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, బాబా వారి కృపకు పాత్రులు కావాలని దర్గా ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి