ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న క్రైమ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న క్రైమ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్
స్థానికం బృందం
కలెక్టర్ చేతులమీదుగా పురస్కారం
స్థానికం ప్రధాన ప్రతినిధి
భువనగిరిలో ఘనంగా గణతంత్ర వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పోలీస్ స్టేషన్లో క్రైమ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో విశేష సేవలు అందించినందుకు గాను జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు చేతులమీదుగా ఆయనకు ఈ పురస్కారం అందజేశారు.77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం భువనగిరి జూనియర్ కాలేజీ మైదానంలో జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖల్లో అంకితభావంతో సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బందికి అవార్డులు, పురస్కార పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారి ఆకాంక్ష్ యాదవ్ పాల్గొన్నారు.అవార్డు అందుకున్న ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేసిన తన సేవలను జిల్లా అధికారులు గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం అప్పగించిన ప్రతి బాధ్యతను నిజాయితీతో నిర్వర్తించడమే తన లక్ష్యమని తెలిపారు. కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడం తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి