ఉత్తమ్ జోలికొస్తే ఊరుకోం. మల్లయ్య యాదవ్ ఖబడ్దార్.కుక్కడపు మహేష్
ఉత్తమ్ జోలికొస్తే ఊరుకోం. మల్లయ్య యాదవ్ ఖబడ్దార్.కుక్కడపు మహేష్
స్థానికం బృందం
హుజూర్నగర్లో కాంగ్రెస్ ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు మహేష్
హుజూర్నగర్, స్థానికం ప్రధాన ప్రతినిధి
సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు హుజూర్నగర్ నియోజకవర్గాన్ని రాజకీయంగా వేడెక్కించాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆందోళనతో పట్టణం ఉద్రిక్తంగా మారింది.యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ పిలుపుతో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో ఇందిరాగాంధీ చౌక్కు చేరుకుని మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘ఉత్తమ్ జోలికొస్తే ఖబడ్దార్’, ‘మల్లయ్య యాదవ్ వెనక్కి తగ్గాలి’ అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కుక్కడపు మహేష్ మాట్లాడుతూ.. ప్రజల మనిషిగా, అభివృద్ధికి అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి మల్లయ్య యాదవ్కు లేదని మండిపడ్డారు. రాజకీయంగా ఉనికిని కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే కేవలం ప్రచారం కోసమే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇకపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గానీ, కాంగ్రెస్ నాయకత్వంపై గానీ నోరు పారేసుకుంటే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని తీవ్రంగా హెచ్చరించారు. మల్లయ్య యాదవ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సైదులు నాయక్, హుజూర్నగర్ మండల అధ్యక్షుడు శీలం చిరంజీవి, గరిడేపల్లి మండల అధ్యక్షుడు నకిరేకంటి సతీష్, హుజూర్నగర్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లచ్చమల్ల హరీష్, చింతలపాలెం మండల అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నగాని వెంకన్న, కోశాధికారి జగన్, గరిడేపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు అశోక్, బంటు సైదులు, కందుల వినోద్, దాసు గోపి, రంగ, నాగరాజు, యల్లావుల మహేష్, కందుల సాయి కుమార్, గుండు గోపి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి