Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:41 AM

ఉత్తమ్ జోలికొస్తే ఊరుకోం. మల్లయ్య యాదవ్ ఖబడ్దార్.కుక్కడపు మహేష్

ఉత్తమ్ జోలికొస్తే ఊరుకోం. మల్లయ్య యాదవ్ ఖబడ్దార్.కుక్కడపు మహేష్

ఉత్తమ్ జోలికొస్తే ఊరుకోం. మల్లయ్య యాదవ్ ఖబడ్దార్.కుక్కడపు మహేష్
January 25, 2026 06:58 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఆగ్రహం

మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు మహేష్

హుజూర్‌నగర్, స్థానికం ప్రధాన ప్రతినిధి

సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని రాజకీయంగా వేడెక్కించాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆందోళనతో పట్టణం ఉద్రిక్తంగా మారింది.యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ పిలుపుతో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో ఇందిరాగాంధీ చౌక్‌కు చేరుకుని మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘ఉత్తమ్ జోలికొస్తే ఖబడ్దార్’, ‘మల్లయ్య యాదవ్ వెనక్కి తగ్గాలి’ అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కుక్కడపు మహేష్ మాట్లాడుతూ.. ప్రజల మనిషిగా, అభివృద్ధికి అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి మల్లయ్య యాదవ్‌కు లేదని మండిపడ్డారు. రాజకీయంగా ఉనికిని కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే కేవలం ప్రచారం కోసమే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇకపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గానీ, కాంగ్రెస్ నాయకత్వంపై గానీ నోరు పారేసుకుంటే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని తీవ్రంగా హెచ్చరించారు. మల్లయ్య యాదవ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సైదులు నాయక్, హుజూర్‌నగర్ మండల అధ్యక్షుడు శీలం చిరంజీవి, గరిడేపల్లి మండల అధ్యక్షుడు నకిరేకంటి సతీష్, హుజూర్‌నగర్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లచ్చమల్ల హరీష్, చింతలపాలెం మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నగాని వెంకన్న, కోశాధికారి జగన్, గరిడేపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు అశోక్, బంటు సైదులు, కందుల వినోద్, దాసు గోపి, రంగ, నాగరాజు, యల్లావుల మహేష్, కందుల సాయి కుమార్, గుండు గోపి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News