Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:58 PM

ఉరుమడ్లలో విద్యుత్ ట్రాక్టర్ ప్రారంభం రైతులకు ఖర్చు తగ్గించే దిశగా అడుగు

ఉరుమడ్లలో విద్యుత్ ట్రాక్టర్ ప్రారంభం రైతులకు ఖర్చు తగ్గించే దిశగా అడుగు

ఉరుమడ్లలో విద్యుత్ ట్రాక్టర్ ప్రారంభం  రైతులకు ఖర్చు తగ్గించే దిశగా అడుగు
February 24, 2026 06:00 PM 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉరుమడ్ల గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా విద్యుత్‌తో (చార్జింగ్ ద్వారా) నడిచే ట్రాక్టర్ మరియు ఆధునిక వ్యవసాయ ట్రాక్టర్ పరికరాలను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన ప్రస్తుతం తెలంగాణరాష్ట్రశాసనమండలి చైర్మన్‌గాబాధ్యతలునిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్లు మరియు ఆధునిక పరికరాల వినియోగం ద్వారా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు.పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కూడా విద్యుత్ వాహనాల వినియోగం ఎంతో మేలు చేస్తుందని, భవిష్యత్‌లో వ్యవసాయం మరింత సాంకేతికత ఆధారంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ సాగర్ల భాను భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, మాజీ ఎంఫీటీసీ పోలగోని స్వామి, వార్డు సభ్యులు పాకాల దినేష్, మర్రి పూలమ్మ శంకర్, యాదవ సంఘం అధ్యక్షులు బొడ్డు శ్రీను, కురుపటి లింగయ్య, అంతటి వెంకన్న, నకిరేకంటి వెంకన్న, అయుతరాజు శేషయ్య మరియు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం స్థానిక రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News