Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:38 PM

ఉరుమడ్లలో విద్యుత్ ట్రాక్టర్ ప్రారంభం రైతులకు ఖర్చు తగ్గించే దిశగా అడుగు

ఉరుమడ్లలో విద్యుత్ ట్రాక్టర్ ప్రారంభం రైతులకు ఖర్చు తగ్గించే దిశగా అడుగు

ఉరుమడ్లలో విద్యుత్ ట్రాక్టర్ ప్రారంభం  రైతులకు ఖర్చు తగ్గించే దిశగా అడుగు
February 24, 2026 06:00 PM 247 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉరుమడ్ల గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా విద్యుత్‌తో (చార్జింగ్ ద్వారా) నడిచే ట్రాక్టర్ మరియు ఆధునిక వ్యవసాయ ట్రాక్టర్ పరికరాలను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన ప్రస్తుతం తెలంగాణరాష్ట్రశాసనమండలి చైర్మన్‌గాబాధ్యతలునిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్లు మరియు ఆధునిక పరికరాల వినియోగం ద్వారా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు.పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కూడా విద్యుత్ వాహనాల వినియోగం ఎంతో మేలు చేస్తుందని, భవిష్యత్‌లో వ్యవసాయం మరింత సాంకేతికత ఆధారంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ సాగర్ల భాను భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, మాజీ ఎంఫీటీసీ పోలగోని స్వామి, వార్డు సభ్యులు పాకాల దినేష్, మర్రి పూలమ్మ శంకర్, యాదవ సంఘం అధ్యక్షులు బొడ్డు శ్రీను, కురుపటి లింగయ్య, అంతటి వెంకన్న, నకిరేకంటి వెంకన్న, అయుతరాజు శేషయ్య మరియు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం స్థానిక రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News