ఉరుమడ్ల రైతు వేదికలో వార్డు సభ్యుల మొదటి విడత శిక్షణ ముగింపు
ఉరుమడ్ల రైతు వేదికలో వార్డు సభ్యుల మొదటి విడత శిక్షణ ముగింపు
Komidala Mahender reddy
నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులకు ఉరుమడ్ల రైతు వేదికలో నిర్వహించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. గ్రామాభివృద్ధి, స్థానిక సంస్థల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కార విధానాలపై సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ శిక్షణను నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన SP. జయలక్ష్మీ (MPDO) మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ వ్యవస్థలో వార్డ్ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సమస్యలను సమయానికి గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాల్సిన బాధ్యత సభ్యులపై ఉందన్నారు. పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం ద్వారా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె సూచించారు.అలాగే అనుముల కోటేశ్ (MPO) స్థానిక పాలనలో అమలు చేయాల్సిన విధానాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఆర్థిక నిర్వహణపై సభ్యులకు మార్గదర్శనం చేశారు. శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రైనర్ యౌసూప్ గ్రామ స్థాయి నాయకత్వ నైపుణ్యాలు, సమావేశాల నిర్వహణ విధానం, తీర్మానాల రూపకల్పన వంటి అంశాలపై వివరించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శిక్షణ ద్వారా తమ బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కలిగిందని వార్డ్సభ్యులుఅభిప్రాయపడ్డారు.గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అధికారులు సభ్యులకు సూచించారు. మొదటి విడత శిక్షణ విజయవంతంగా ముగియగా, తదుపరి విడత కార్యక్రమం త్వరలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి