Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:45 PM

ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఆందోళన పిలుపు

ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఆందోళన పిలుపు

ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఆందోళన పిలుపు
13-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

20, 21న ఎంపీడీవో కార్యాలయాల ముందు ధర్నాలు

చౌటుప్పల్:

ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20, 21 తేదీలలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల ఎంపీడీవో కార్యాలయాల ముందు నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు.

సోమవారం చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం, మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నో పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, కొత్తగా తీసుకొచ్చిన జీ-రాంజి చట్టంతో కార్మికుల హక్కులను దెబ్బతీస్తోందని విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు సరైన వేతనం అందకపోవడం, పనికి వెళ్లినా డబ్బులు రావడం లేదని, పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు కూడా లేవని ఆరోపించారు. నీడ, తాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు, బీమా వంటి సౌకర్యాలు లేకుండా కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేవైసీ పేరుతో కూలీలను పనికి దూరం చేస్తున్నారని, ఈ కొత్త విధానం పేదలను ఉపాధి నుంచి దూరం చేసే ప్రయత్నమని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు.

పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలంటే అందరూ ఐక్యంగా, సంఘటితంగా ఈ ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కార్మికులను కోరారు.

ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు అధ్యక్షత వహించగా, మానే సాలయ్య, యాట బాలరాజు, నేరడి మహేష్, జంగం అంజయ్య, గువ్వల చంద్రయ్య, నీల శ్రీను, కొంతం శ్రీనివాస్ రెడ్డి, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దకొండూరు గ్రామానికి చెందిన పలువురు కార్మికులు కూడా హాజరయ్యారు.

Sthanikam

ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఆందోళన పిలుపు

Article Image

20, 21న ఎంపీడీవో కార్యాలయాల ముందు ధర్నాలు

చౌటుప్పల్:

ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20, 21 తేదీలలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల ఎంపీడీవో కార్యాలయాల ముందు నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు.

సోమవారం చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం, మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నో పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, కొత్తగా తీసుకొచ్చిన జీ-రాంజి చట్టంతో కార్మికుల హక్కులను దెబ్బతీస్తోందని విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు సరైన వేతనం అందకపోవడం, పనికి వెళ్లినా డబ్బులు రావడం లేదని, పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు కూడా లేవని ఆరోపించారు. నీడ, తాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు, బీమా వంటి సౌకర్యాలు లేకుండా కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేవైసీ పేరుతో కూలీలను పనికి దూరం చేస్తున్నారని, ఈ కొత్త విధానం పేదలను ఉపాధి నుంచి దూరం చేసే ప్రయత్నమని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు.

పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలంటే అందరూ ఐక్యంగా, సంఘటితంగా ఈ ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కార్మికులను కోరారు.

ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు అధ్యక్షత వహించగా, మానే సాలయ్య, యాట బాలరాజు, నేరడి మహేష్, జంగం అంజయ్య, గువ్వల చంద్రయ్య, నీల శ్రీను, కొంతం శ్రీనివాస్ రెడ్డి, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దకొండూరు గ్రామానికి చెందిన పలువురు కార్మికులు కూడా హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News