ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను గ్రామీణ ప్రజలు తిప్పికొట్టాలి
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను గ్రామీణ ప్రజలు తిప్పికొట్టాలి
Editor Desk
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను గ్రామీణ ప్రజలు సమైక్యంగా తిప్పికొట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.
జనంపల్లి గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ—కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రాలపై భారాన్ని మోపి కేంద్ర ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. చట్టం పేరును సైతం మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి, ఆర్థిక భద్రత, ఆత్మగౌరవం కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వేమవరపు సుధీర్ బాబు మాట్లాడుతూ—సంక్రాంతి సందర్భంగా మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి