Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:36 AM

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను గ్రామీణ ప్రజలు తిప్పికొట్టాలి

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను గ్రామీణ ప్రజలు తిప్పికొట్టాలి

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను గ్రామీణ ప్రజలు తిప్పికొట్టాలి
January 16, 2026 05:35 PM 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను గ్రామీణ ప్రజలు సమైక్యంగా తిప్పికొట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.

జనంపల్లి గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ—కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రాలపై భారాన్ని మోపి కేంద్ర ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. చట్టం పేరును సైతం మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి, ఆర్థిక భద్రత, ఆత్మగౌరవం కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వేమవరపు సుధీర్ బాబు మాట్లాడుతూ—సంక్రాంతి సందర్భంగా మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News