Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:57 AM

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని రద్దు చేయాలి.

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని రద్దు చేయాలి.

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని రద్దు చేయాలి.
21-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ, : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, జిల్లా ఉపాధ్యక్షుడు సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద నిర్వహించిన కూలీల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గిస్తూ చట్టాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు.

కొత్త విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం వాటా చెల్లించాల్సి రావడం వల్ల కూలీలకు పనులు దొరకకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిస్థలాల్లో రెండుసార్లు ఫోటోలు తీసే విధానం కూలీలను అవమానించేలా ఉందన్నారు.

సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి రోజుకూలీని రూ.600కు పెంచాలని, పనిముట్లు ఉచితంగా ఇవ్వాలని, భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో భీమనబోయిన జంగయ్య, మద్దెల శంకరయ్య, జక్కల అంజయ్య, చేగురి నర్సింహ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని రద్దు చేయాలి.

Article Image

వలిగొండ, : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, జిల్లా ఉపాధ్యక్షుడు సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద నిర్వహించిన కూలీల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గిస్తూ చట్టాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు.

కొత్త విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం వాటా చెల్లించాల్సి రావడం వల్ల కూలీలకు పనులు దొరకకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిస్థలాల్లో రెండుసార్లు ఫోటోలు తీసే విధానం కూలీలను అవమానించేలా ఉందన్నారు.

సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి రోజుకూలీని రూ.600కు పెంచాలని, పనిముట్లు ఉచితంగా ఇవ్వాలని, భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో భీమనబోయిన జంగయ్య, మద్దెల శంకరయ్య, జక్కల అంజయ్య, చేగురి నర్సింహ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News