Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:07 PM

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని రద్దు చేయాలి.

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని రద్దు చేయాలి.

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని రద్దు చేయాలి.
May 21, 2026 08:32 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ, : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, జిల్లా ఉపాధ్యక్షుడు సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద నిర్వహించిన కూలీల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గిస్తూ చట్టాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు.

కొత్త విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం వాటా చెల్లించాల్సి రావడం వల్ల కూలీలకు పనులు దొరకకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిస్థలాల్లో రెండుసార్లు ఫోటోలు తీసే విధానం కూలీలను అవమానించేలా ఉందన్నారు.

సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి రోజుకూలీని రూ.600కు పెంచాలని, పనిముట్లు ఉచితంగా ఇవ్వాలని, భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో భీమనబోయిన జంగయ్య, మద్దెల శంకరయ్య, జక్కల అంజయ్య, చేగురి నర్సింహ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News