Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 09:38 AM

ఉద్యోగుల సంఘం డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణ. అదనపు కలెక్టర్

ఉద్యోగుల సంఘం డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణ. అదనపు కలెక్టర్

ఉద్యోగుల సంఘం డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణ. అదనపు కలెక్టర్
January 21, 2026 07:03 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యోగుల ఐక్యతే జిల్లా ప్రగతికి బలం

డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణలో అదనపు కలెక్టర్ వ్యాఖ్యలు

యాదాద్రి భువనగిరి, స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నూతన డైరీ–2026, క్యాలెండర్‌ను కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లా ఉద్యోగులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాను రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని ప్రశంసించారు. జేఏసీ చైర్మెన్ మందడి ఉపేందర్ రెడ్డి నాయకత్వంలో ఉద్యోగులు ఒకే తాటిపై నిలిచి ఐక్యంగా ముందుకు సాగడం జిల్లాకు బలమని పేర్కొన్నారు. ఈ ఐక్యత కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మందడి ఉపేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో కృష్ణా రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో వి. శేఖర్ రెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్, తెలంగాణ నాన్‌గెజిటెడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ధరణికోట భగత్, ట్రెసా, పంచాయతీ కార్యదర్శుల సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు, టీజీవో, టీఎన్జీవో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News