Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 PM

ఉద్యోగుల సంఘం డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణ. అదనపు కలెక్టర్

ఉద్యోగుల సంఘం డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణ. అదనపు కలెక్టర్

ఉద్యోగుల సంఘం డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణ. అదనపు కలెక్టర్
January 21, 2026 07:03 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యోగుల ఐక్యతే జిల్లా ప్రగతికి బలం

డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణలో అదనపు కలెక్టర్ వ్యాఖ్యలు

యాదాద్రి భువనగిరి, స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నూతన డైరీ–2026, క్యాలెండర్‌ను కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లా ఉద్యోగులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాను రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని ప్రశంసించారు. జేఏసీ చైర్మెన్ మందడి ఉపేందర్ రెడ్డి నాయకత్వంలో ఉద్యోగులు ఒకే తాటిపై నిలిచి ఐక్యంగా ముందుకు సాగడం జిల్లాకు బలమని పేర్కొన్నారు. ఈ ఐక్యత కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మందడి ఉపేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో కృష్ణా రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో వి. శేఖర్ రెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్, తెలంగాణ నాన్‌గెజిటెడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ధరణికోట భగత్, ట్రెసా, పంచాయతీ కార్యదర్శుల సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు, టీజీవో, టీఎన్జీవో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News