Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 06, 2026 06:57 PM

తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం

తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం

తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం
March 06, 2026 12:20 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాజీనామా నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ నిర్ణయంతో ఐదుగురు గవర్నర్లను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయగా, ముగ్గురిని కొత్తగా నియమించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివప్రతాప్ శుక్లాను నియమించారు.

శివప్రతాప్ శుక్లా గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే శాసనసభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు.బీహార్ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్థానంలో సయ్యద్ అటా హస్నైన్‌ను నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాజీనామా నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ గవర్నర్ రాజీనామా కేంద్ర హోంమంత్రి ఒత్తిడి వల్లే జరిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News