Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:41 AM

తండ్రి జ్ఞాపకార్థం పల్లివాడ పాఠశాలకు లక్ష యాభై వేలతో వేదిక

తండ్రి జ్ఞాపకార్థం పల్లివాడ పాఠశాలకు లక్ష యాభై వేలతో వేదిక

తండ్రి జ్ఞాపకార్థం పల్లివాడ పాఠశాలకు లక్ష యాభై వేలతో వేదిక
January 28, 2026 11:40 AM 272 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తండ్రి జ్ఞాపకార్థం పాఠశాలకు వేదిక నిర్మాణం

రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి:

రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మాజీ సర్పంచ్ కంకణాల నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కంకణాల రంజిత్ కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్ష యాభై వేల రూపాయల వ్యయంతో పాఠశాల వేదిక నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు సక్రమంగా నిర్వహించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడనుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు విద్యాభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తండ్రి జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన రంజిత్ కుమార్ రెడ్డిని అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్. సుధారాణి, రఘుమారెడ్డి, మేడీ మధు, కాన్సిరాం, వెంకట్రాం రెడ్డి, జయశ్రీ, లలిత, నాయకులు, ఒకటవ వార్డు సభ్యుడు దండిగా పాండు, మాజీ ఉపసర్పంచ్ బెల్లి నరసింహ, దండిగ నాగరాజు, విజయ్, ఆరోరి లక్ష్మయ్య, దండిగా లక్ష్మయ్య, దండిగా ఉపేందర్, బెల్లి ఆది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News