Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:58 AM

తండ్రి జ్ఞాపకార్థం పల్లివాడ పాఠశాలకు లక్ష యాభై వేలతో వేదిక

తండ్రి జ్ఞాపకార్థం పల్లివాడ పాఠశాలకు లక్ష యాభై వేలతో వేదిక

తండ్రి జ్ఞాపకార్థం పల్లివాడ పాఠశాలకు లక్ష యాభై వేలతో వేదిక
28-01-2026 281 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తండ్రి జ్ఞాపకార్థం పాఠశాలకు వేదిక నిర్మాణం

రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి:

రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మాజీ సర్పంచ్ కంకణాల నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కంకణాల రంజిత్ కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్ష యాభై వేల రూపాయల వ్యయంతో పాఠశాల వేదిక నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు సక్రమంగా నిర్వహించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడనుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు విద్యాభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తండ్రి జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన రంజిత్ కుమార్ రెడ్డిని అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్. సుధారాణి, రఘుమారెడ్డి, మేడీ మధు, కాన్సిరాం, వెంకట్రాం రెడ్డి, జయశ్రీ, లలిత, నాయకులు, ఒకటవ వార్డు సభ్యుడు దండిగా పాండు, మాజీ ఉపసర్పంచ్ బెల్లి నరసింహ, దండిగ నాగరాజు, విజయ్, ఆరోరి లక్ష్మయ్య, దండిగా లక్ష్మయ్య, దండిగా ఉపేందర్, బెల్లి ఆది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తండ్రి జ్ఞాపకార్థం పల్లివాడ పాఠశాలకు లక్ష యాభై వేలతో వేదిక

Article Image

తండ్రి జ్ఞాపకార్థం పాఠశాలకు వేదిక నిర్మాణం

రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి:

రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మాజీ సర్పంచ్ కంకణాల నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కంకణాల రంజిత్ కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్ష యాభై వేల రూపాయల వ్యయంతో పాఠశాల వేదిక నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు సక్రమంగా నిర్వహించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడనుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు విద్యాభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తండ్రి జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన రంజిత్ కుమార్ రెడ్డిని అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్. సుధారాణి, రఘుమారెడ్డి, మేడీ మధు, కాన్సిరాం, వెంకట్రాం రెడ్డి, జయశ్రీ, లలిత, నాయకులు, ఒకటవ వార్డు సభ్యుడు దండిగా పాండు, మాజీ ఉపసర్పంచ్ బెల్లి నరసింహ, దండిగ నాగరాజు, విజయ్, ఆరోరి లక్ష్మయ్య, దండిగా లక్ష్మయ్య, దండిగా ఉపేందర్, బెల్లి ఆది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News