తండ్రి జ్ఞాపకార్థం పల్లివాడ పాఠశాలకు లక్ష యాభై వేలతో వేదిక
తండ్రి జ్ఞాపకార్థం పల్లివాడ పాఠశాలకు లక్ష యాభై వేలతో వేదిక
స్థానికం బృందం
తండ్రి జ్ఞాపకార్థం పాఠశాలకు వేదిక నిర్మాణం
రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి:
రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మాజీ సర్పంచ్ కంకణాల నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కంకణాల రంజిత్ కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్ష యాభై వేల రూపాయల వ్యయంతో పాఠశాల వేదిక నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు సక్రమంగా నిర్వహించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడనుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు విద్యాభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తండ్రి జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన రంజిత్ కుమార్ రెడ్డిని అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్. సుధారాణి, రఘుమారెడ్డి, మేడీ మధు, కాన్సిరాం, వెంకట్రాం రెడ్డి, జయశ్రీ, లలిత, నాయకులు, ఒకటవ వార్డు సభ్యుడు దండిగా పాండు, మాజీ ఉపసర్పంచ్ బెల్లి నరసింహ, దండిగ నాగరాజు, విజయ్, ఆరోరి లక్ష్మయ్య, దండిగా లక్ష్మయ్య, దండిగా ఉపేందర్, బెల్లి ఆది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి