తిరువూరు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు
తిరువూరు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు
GADDAM JAGANMOHAN REDDY
తిరువూరు జనవరి 12(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో వయనాడ్ పార్లమెంటు సభ్యురాలు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ 53 వ జన్మదిన వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీవన్ బాబు అధ్యక్షతన కేక్ కట్ చేసి, స్వీట్లు,పండ్లు పంచి ఘనంగా నిర్వహించడం జరిగినది.అనంతరం జీవన్ బాబు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాష్ రావు,బి.సి.సెల్ రాష్ట్ర నాయకులు గంజా కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని,ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళల ఉండాలని భవిష్యత్ లో ఆమె సేవలు మరింత అవసరం అని పార్లమెంట్ సభ్యురాలు గా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో డి.సి.సి.మాజీ ప్రధానకార్యదర్శి కొత్తగుండ్ల గోపాలకృష్ణ,తిరువూరు పట్టణ బి.సి.సెల్ నాయకులు పర్వతం రామారావు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు, ఇజ్జాడ జగన్నాథం,ఇమ్మనేని శ్రీనివాసరావు, పల్నాటి సత్యనారాయణ,చావల రంగయ్య,గంధం శ్రీనివాసరావు,పగుట్ల చంద్రయ్య,యద్దనపూడి రాములు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి