Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:04 PM

తిరువూరు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

తిరువూరు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

తిరువూరు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు
January 12, 2026 01:56 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు జనవరి 12(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో వయనాడ్ పార్లమెంటు సభ్యురాలు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ 53 వ జన్మదిన వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీవన్ బాబు అధ్యక్షతన కేక్ కట్ చేసి, స్వీట్లు,పండ్లు పంచి ఘనంగా నిర్వహించడం జరిగినది.అనంతరం జీవన్ బాబు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాష్ రావు,బి.సి.సెల్ రాష్ట్ర నాయకులు గంజా కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని,ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళల ఉండాలని భవిష్యత్ లో ఆమె సేవలు మరింత అవసరం అని పార్లమెంట్ సభ్యురాలు గా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో డి.సి.సి.మాజీ ప్రధానకార్యదర్శి కొత్తగుండ్ల గోపాలకృష్ణ,తిరువూరు పట్టణ బి.సి.సెల్ నాయకులు పర్వతం రామారావు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు, ఇజ్జాడ జగన్నాథం,ఇమ్మనేని శ్రీనివాసరావు, పల్నాటి సత్యనారాయణ,చావల రంగయ్య,గంధం శ్రీనివాసరావు,పగుట్ల చంద్రయ్య,యద్దనపూడి రాములు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News