తిరుపతి జిల్లా పోలీస్ శాఖ - ఆన్లైన్ బెట్టింగ్ పై జిల్లా పోలీసుల ఉక్కుపాదం.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ - ఆన్లైన్ బెట్టింగ్ పై జిల్లా పోలీసుల ఉక్కుపాదం.
GADDAM JAGANMOHAN REDDY
తిరుపతి జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపిఎస్,గారు ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారిచేసి ఉన్నారు తెలిపారు.ఈ నేపథ్యంలో తిరుపతి పట్టణం బైరాగిపట్టెడ పద్మావతి పార్క్ సమీపంలో ఆన్లైన్ క్యాసినో మరియు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.7,48,000 నగదు, ఒక ల్యాప్టాప్, 04 మొబైల్ ఫోన్లు మరియు 04 Paytm QR కోడ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ ఎం.భక్తవత్సలం పర్యవేక్షణలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్ఐలు ఓ.రామస్వామి, జి.ప్రసాద్ మరియు క్రైమ్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి ముద్దాయిలను అరెస్టు చేశారు. నిందితులు ఎస్. విన్. ఎక్సేంజ్ మరియు కింగ్ ఎక్సేంజ్ వంటి యాప్ల ద్వారా అమాయక ప్రజలను ఆకర్షించి క్యాసినో మరియు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ కమిషన్ రూపంలో అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు సమాచారం
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి