తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టిడిపి నిరసన
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టిడిపి నిరసన
స్థానికం బృందం
ఆదోనిలో ప్రత్యేక పూజలు, ఖండన కార్యక్రమం
ఆదోని,
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జరిగిన కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తుండగా, ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ ఆదోని నియోజకవర్గంలో ఘాటుగా స్పందించింది. మాజీ శాసనసభ్యులు, ఆదోని టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఖండన కార్యక్రమం నిర్వహించారు.
ఆదోని నియోజకవర్గం తిరుమల్ నగరంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డూ కల్తీ మహా కుంభకోణాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఘోరమైన కల్తీ జరిగిందన్న విషయం సుప్రీంకోర్టు పరిధిలోనే బయటపడటం దురదృష్టకరమన్నారు. పాల లేకుండా నెయ్యి తయారు చేయడం, నెయ్యిలో కల్తీ కలపడం, ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారి ప్రసాదాలు తయారు చేయడం వంటి విషయాలు సిట్ దర్యాప్తు, చార్జిషీట్ల ద్వారా స్పష్టమయ్యాయని తెలిపారు.టీటీడీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి, కల్తీకి రహదారి వేసిన వైసీపీ పాలకులు ఎటువంటి సరైన విచారణ లేకుండా అనుమానాస్పద సంస్థలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో సుమారు రూ.235 కోట్ల శ్రీవారి నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు.
తప్పు చేయలేదని చెప్పేవారు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి అంశంపై ఎవరూ మాట్లాడకూడదని కోర్టు ఆదేశాలు ఎందుకు తెచ్చుకున్నారని, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారంటూ నిలదీశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా, అందులో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేయడం మహాపాపమని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి