Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:42 PM

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టిడిపి నిరసన

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టిడిపి నిరసన

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టిడిపి నిరసన
January 30, 2026 09:11 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోనిలో ప్రత్యేక పూజలు, ఖండన కార్యక్రమం

ఆదోని,

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జరిగిన కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తుండగా, ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ ఆదోని నియోజకవర్గంలో ఘాటుగా స్పందించింది. మాజీ శాసనసభ్యులు, ఆదోని టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఖండన కార్యక్రమం నిర్వహించారు.

ఆదోని నియోజకవర్గం తిరుమల్ నగరంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డూ కల్తీ మహా కుంభకోణాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఘోరమైన కల్తీ జరిగిందన్న విషయం సుప్రీంకోర్టు పరిధిలోనే బయటపడటం దురదృష్టకరమన్నారు. పాల లేకుండా నెయ్యి తయారు చేయడం, నెయ్యిలో కల్తీ కలపడం, ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారి ప్రసాదాలు తయారు చేయడం వంటి విషయాలు సిట్ దర్యాప్తు, చార్జిషీట్ల ద్వారా స్పష్టమయ్యాయని తెలిపారు.టీటీడీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి, కల్తీకి రహదారి వేసిన వైసీపీ పాలకులు ఎటువంటి సరైన విచారణ లేకుండా అనుమానాస్పద సంస్థలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో సుమారు రూ.235 కోట్ల శ్రీవారి నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు.

తప్పు చేయలేదని చెప్పేవారు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి అంశంపై ఎవరూ మాట్లాడకూడదని కోర్టు ఆదేశాలు ఎందుకు తెచ్చుకున్నారని, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారంటూ నిలదీశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా, అందులో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేయడం మహాపాపమని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News