Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:10 PM

తెలుగు భాషా వికాసంపై ఎన్‌జీ కళాశాలలో జాతీయ సదస్సు

తెలుగు భాషా వికాసంపై ఎన్‌జీ కళాశాలలో జాతీయ సదస్సు

తెలుగు భాషా వికాసంపై ఎన్‌జీ కళాశాలలో జాతీయ సదస్సు
January 19, 2026 05:49 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నల్లగొండ:

తెలుగు భాషా వికాసంలో చోటుచేసుకుంటున్న మార్పులు, విభిన్న దృక్పథాలపై చర్చించేందుకు నాగార్జున ప్రభుత్వ కళాశాల వేదిక సిద్ధమైంది. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో జనవరి 30న “తెలుగు భాషా వికాసం – వివిధ వైఖరులు” అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగు విభాగాధ్యక్షుడు డా. వెల్దోడి శ్రీధర్ తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, తెలుగు అధ్యాపకులు పాల్గొన్నారు.

తెలుగు భాష పరిణామ క్రమం, ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక డిజిటల్ యుగం వరకు భాషలో వచ్చిన మార్పులు, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో తెలుగు ఎదుర్కొంటున్న సవాళ్లపై సదస్సులో లోతైన విశ్లేషణ జరగనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు, భాషావేత్తలు, సాహితీవేత్తలు, కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు.ప్రధానంగా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, కృత్రిమ మేధ (AI) యుగంలో తెలుగు భాష వినియోగం, సాంకేతిక రంగంలో తెలుగు అవకాశాలపై చర్చ జరగనుంది. అలాగే తెలుగు నేలపై ఉన్న వివిధ మాండలికాల అస్తిత్వం, తెలంగాణ మాండలిక భాషా సౌరభం, సాహిత్య వికాసం, ఆధునిక సాహిత్యంలో కొత్త ధోరణులు, విమర్శనాత్మక దృక్పథాలపై పరిశోధనా పత్రాలు ఉండనున్నాయి. మారుతున్న విద్యా విధానంలో తెలుగు బోధనకుఅవలంబించాల్సిన నూతన పద్ధతులపై కూడా ప్రముఖ విద్యావేత్తలు ప్రసంగించనున్నారు.తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కళాశాల తెలుగు విభాగం కోరింది. సదస్సులో పాల్గొనే ప్రతినిధులు ఈ నెల 29లోపు పూర్తి పరిశోధనా పత్రాన్ని telugungc2022@gmail.com కు పంపించాలని సూచించారు. నమోదు రుసుము ఆచార్యులకు రూ.1000, పరిశోధకులకు రూ.500గా నిర్ణయించారు. ఇతర వివరాలకు 9866977741 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News