తాటి చెట్టు కింద పడిన గీత కార్మికుడు… రోడ్డున పడిన కుటుంబం
తాటి చెట్టు కింద పడిన గీత కార్మికుడు… రోడ్డున పడిన కుటుంబం
Editor Desk
తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు వీరమల్ల శంకరయ్య (తండ్రి పాపయ్య) తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ కాలు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.వృత్తి నిమిత్తం తాటి చెట్టును ఎక్కిన సమయంలో మధ్యలో సమతుల్యత కోల్పోయి కింద పడటంతో తలకు, కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే శంకరయ్యను రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నల్లగొండ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం శంకరయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న గీత కార్మికుడికి ప్రమాదం జరగడంతో ఆయన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో జీవిస్తున్న ఈ కుటుంబం ఒక్కసారిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడినట్టయ్యింది.ప్రమాదంలో గాయపడ్డ శంకరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గ్రామస్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. గీత కార్మికులకు రక్షణ చర్యలు, బీమా సదుపాయాలు అమలు చేయాలని వారు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి