Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:39 PM

తాటి చెట్టు ప్రమాదం.. చేయూత కోసం ఎదురుచూపు

తాటి చెట్టు ప్రమాదం.. చేయూత కోసం ఎదురుచూపు

తాటి చెట్టు ప్రమాదం.. చేయూత కోసం ఎదురుచూపు
January 29, 2026 07:16 AM 354 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన పాలకూరి నర్సింహా (58) తాటి చెట్టు ఎక్కుతుండగా జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. జనవరి 27 సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం అతని కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గాయపడిన నర్సింహాను వెంటనే నల్లగొండలోని స్కంద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పేదరికం మధ్య జీవనం సాగిస్తున్న ఈ కుటుంబానికి గతంలోనే గాఢమైన విషాదం ఎదురైంది. చిన్న వయస్సులోనే చెట్టు ఎక్కి పడి కుమారుడు మృతి చెందగా, ప్రస్తుతం ఒక్క కుమార్తె మాత్రమే కుటుంబానికి ఆధారం. భార్య లక్షమ్మ కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఇంటి పనులకే పరిమితమైంది.

కుటుంబ పోషణ భారం మొత్తం నర్సింహాపైనే ఉంది. ఒకవైపు కౌలుకు వ్యవసాయం చేస్తూ, మరోవైపు తాటి చెట్లు ఎక్కి కళ్లను తీసి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నడుపుతున్నాడు. తాటి చెట్టునే జీవనాధారంగా చేసుకున్న వ్యక్తి ప్రమాదానికి గురికావడంతో ఆసుపత్రి ఖర్చులు తీరని భారంగా మారాయి.సమాజానికి శ్రమను అంకితం చేసిన ఒక కష్టజీవి ఈ పరిస్థితిలో చేయూత కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రమాదంలో పడిన ఒక వ్యక్తికి సహాయం చేయడం మాత్రమే కాదు, కష్టకాలంలో ఒక కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత సమాజంపై ఉంది. ఈ తరుణంలో నర్సింహా కుటుంబానికి మన వంతు సహాయం అందించడం సామాజిక బాధ్యతగా మారింది.

సహాయం చేయదలచిన వారు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా

95735 69772 నంబర్‌కు పంపవచ్చని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News