తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!
తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!
Editor Desk
ఖమ్మం స్థానికం ప్రధాన ప్రతినిధి
అచ్చమైన తెలంగాణ ఇంటి వంటల రుచులు, సంప్రదాయ ఆతిథ్యంతో కూడిన ప్రత్యేక విందు ఖమ్మంలో జరిగింది. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఘనంగా తెలంగాణ వంటకాల విందు ఏర్పాటు చేశారు.
మంత్రి ఆహ్వానంతో జరిగిన ఈ విందులో స్వచ్ఛమైన తెలంగాణ నేటివిటీ సీఎం మనసు దోచుకుంది. “భోజనం అదిరింది… ఆతిథ్యం మెరిసింది” అన్నట్టుగా సాగిన విందులో ప్రతి వంటకం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, సహచర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.తెలంగాణ స్టైల్లో వండిన నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు, చేపల కూర, మటన్ ఫ్రై, ప్రత్యేక రుచితో చేసిన మటన్ కీమా సహా దాదాపు 17 రకాల వంటకాలతో సీఎంకు రాజభోజనం వడ్డించారు. సీఎం ఈ వంటకాలను ఆసక్తిగా రుచి చూశారు.ఈ విందును మంత్రి సతీమణి పొంగులేటి మాధురి స్వయంగా పర్యవేక్షిస్తూ సంప్రదాయ రుచులు తగ్గకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.మాంసాహారంతో పాటు జొన్న రొట్టెలు, వెజ్ పలావ్, క్యారెట్–కొబ్బరి ఇగురు, పచ్చిమిర్చి పచ్చడి వంటి శాఖాహార వంటకాలు కూడా సీఎంను విశేషంగా ఆకట్టుకున్నాయి.భోజనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, చేనేత పెయింటింగ్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి బహూకరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి