Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:51 AM

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!
January 18, 2026 06:53 PM 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఖమ్మం స్థానికం ప్రధాన ప్రతినిధి

అచ్చమైన తెలంగాణ ఇంటి వంటల రుచులు, సంప్రదాయ ఆతిథ్యంతో కూడిన ప్రత్యేక విందు ఖమ్మంలో జరిగింది. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఘనంగా తెలంగాణ వంటకాల విందు ఏర్పాటు చేశారు.

మంత్రి ఆహ్వానంతో జరిగిన ఈ విందులో స్వచ్ఛమైన తెలంగాణ నేటివిటీ సీఎం మనసు దోచుకుంది. “భోజనం అదిరింది… ఆతిథ్యం మెరిసింది” అన్నట్టుగా సాగిన విందులో ప్రతి వంటకం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, సహచర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.తెలంగాణ స్టైల్లో వండిన నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు, చేపల కూర, మటన్ ఫ్రై, ప్రత్యేక రుచితో చేసిన మటన్ కీమా సహా దాదాపు 17 రకాల వంటకాలతో సీఎంకు రాజభోజనం వడ్డించారు. సీఎం ఈ వంటకాలను ఆసక్తిగా రుచి చూశారు.ఈ విందును మంత్రి సతీమణి పొంగులేటి మాధురి స్వయంగా పర్యవేక్షిస్తూ సంప్రదాయ రుచులు తగ్గకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.మాంసాహారంతో పాటు జొన్న రొట్టెలు, వెజ్ పలావ్, క్యారెట్–కొబ్బరి ఇగురు, పచ్చిమిర్చి పచ్చడి వంటి శాఖాహార వంటకాలు కూడా సీఎంను విశేషంగా ఆకట్టుకున్నాయి.భోజనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, చేనేత పెయింటింగ్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి బహూకరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News