Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:01 PM

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!
January 18, 2026 06:53 PM 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఖమ్మం స్థానికం ప్రధాన ప్రతినిధి

అచ్చమైన తెలంగాణ ఇంటి వంటల రుచులు, సంప్రదాయ ఆతిథ్యంతో కూడిన ప్రత్యేక విందు ఖమ్మంలో జరిగింది. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఘనంగా తెలంగాణ వంటకాల విందు ఏర్పాటు చేశారు.

మంత్రి ఆహ్వానంతో జరిగిన ఈ విందులో స్వచ్ఛమైన తెలంగాణ నేటివిటీ సీఎం మనసు దోచుకుంది. “భోజనం అదిరింది… ఆతిథ్యం మెరిసింది” అన్నట్టుగా సాగిన విందులో ప్రతి వంటకం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, సహచర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.తెలంగాణ స్టైల్లో వండిన నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు, చేపల కూర, మటన్ ఫ్రై, ప్రత్యేక రుచితో చేసిన మటన్ కీమా సహా దాదాపు 17 రకాల వంటకాలతో సీఎంకు రాజభోజనం వడ్డించారు. సీఎం ఈ వంటకాలను ఆసక్తిగా రుచి చూశారు.ఈ విందును మంత్రి సతీమణి పొంగులేటి మాధురి స్వయంగా పర్యవేక్షిస్తూ సంప్రదాయ రుచులు తగ్గకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.మాంసాహారంతో పాటు జొన్న రొట్టెలు, వెజ్ పలావ్, క్యారెట్–కొబ్బరి ఇగురు, పచ్చిమిర్చి పచ్చడి వంటి శాఖాహార వంటకాలు కూడా సీఎంను విశేషంగా ఆకట్టుకున్నాయి.భోజనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, చేనేత పెయింటింగ్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి బహూకరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News