తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి కొత్తవోల నరేష్, గూడూరి కళ్యాణ్
తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి కొత్తవోల నరేష్, గూడూరి కళ్యాణ్
Biksham
సూర్యాపేటలో ఘనంగా పార్టీలోకి ఆహ్వానం
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 21వ వార్డుకు చెందిన దీపమాల ఆధ్వర్యంలో కొత్తవోల నరేష్, గూడూరి కళ్యాణ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ వారికి కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కుల కోసం పార్టీ చేపడుతున్న పోరాటాలు ప్రజల్లో విశేష స్పందన పొందుతున్నాయని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, మల్లేష్, నెలచర్ల మధు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి