Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల విద్యకు బలమైన పునాది వేసిన ప్రీ ప్రైమరీ పాఠశాల

తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల విద్యకు బలమైన పునాది వేసిన ప్రీ ప్రైమరీ పాఠశాల

తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల విద్యకు బలమైన పునాది వేసిన ప్రీ ప్రైమరీ పాఠశాల
January 19, 2026 02:47 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ పరిధిలోని అల్లాపూర్ గ్రామపంచాయతీ మల్పరేగడి తండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రీ ప్రైమరీ పాఠశాలను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంనుంచి తొలి దశలో 210 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరగతులు ప్రారంభించామని పేర్కొన్నారు. ఇందులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ఉంటాయని వివరించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటలు, పాటలు, పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చిన్న వయసులోనే విద్యకు బలమైన పునాది వేయడం ద్వారా పిల్లల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్య పొందాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దోహదపడటమే కాకుండా గ్రామీణ చిన్నారుల భవిష్యత్తును వెలిగిస్తుందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, విద్య రంగంలో మరిన్ని చర్యలు తీసుకొని ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తహేర్ అలీ, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, అల్లాపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ రామ్ శెట్టి, గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News