Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 03:59 PM

ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకోవాలి: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకోవాలి: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకోవాలి: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
April 13, 2026 02:30 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వాహనదారులు ప్రయాణ సమయాల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తనతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వస్తుందని హెచ్చరించారు.అతివేగంగా వాహనాలు నడపడం వల్ల అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణ పాటించాలని కోరారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్, ట్రాఫిక్ సిఐ విజయ మోహన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు అనేవి కేవలం జరిమానాల కోసం కాదని, ప్రజల భద్రత కోసమేనని స్పష్టం చేశారు. మలుపుల వద్ద, రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, 9వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News