ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకోవాలి: చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకోవాలి: చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
K.RAVI
చౌటుప్పల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వాహనదారులు ప్రయాణ సమయాల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తనతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వస్తుందని హెచ్చరించారు.అతివేగంగా వాహనాలు నడపడం వల్ల అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణ పాటించాలని కోరారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్, ట్రాఫిక్ సిఐ విజయ మోహన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు అనేవి కేవలం జరిమానాల కోసం కాదని, ప్రజల భద్రత కోసమేనని స్పష్టం చేశారు. మలుపుల వద్ద, రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, 9వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి