Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:52 AM

ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకోవాలి: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకోవాలి: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకోవాలి: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
April 13, 2026 02:30 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వాహనదారులు ప్రయాణ సమయాల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తనతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వస్తుందని హెచ్చరించారు.అతివేగంగా వాహనాలు నడపడం వల్ల అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణ పాటించాలని కోరారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్, ట్రాఫిక్ సిఐ విజయ మోహన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు అనేవి కేవలం జరిమానాల కోసం కాదని, ప్రజల భద్రత కోసమేనని స్పష్టం చేశారు. మలుపుల వద్ద, రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, 9వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News