Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:36 AM

సుస్థిర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి – ఆరుట్ల సురేష్ కుమార్

సుస్థిర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి – ఆరుట్ల సురేష్ కుమార్

సుస్థిర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి  – ఆరుట్ల సురేష్ కుమార్
January 12, 2026 06:15 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

సుస్థిర భవిష్యత్తు నిర్మాణానికి యువత బాధ్యతతో ముందుకు రావాలని చైతన్య భారతి ఫౌండేషన్ చైర్మెన్ ఆరుట్ల సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. దృఢచిత్తంతో, దేశాభివృద్ధి లక్ష్యంగా యువత పునరంకితమవ్వాల్సిన అవసరం ఉందన్నారు.స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని చైతన్య భారతి ఫౌండేషన్, వివేకానంద యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్‌లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచ వేదికపై చాటిన మహానుభావుడు స్వామి వివేకానందుడన్నారు. తన ప్రసంగాలు, బోధనలతో యువతలో చైతన్యం నింపిన స్ఫూర్తిప్రదాతగా ఆయన నిలిచారని పేర్కొన్నారు.యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడమే స్వామి వివేకానంద ఆశయమని తెలిపారు. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే దేశానికి సుస్థిర భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, తెలంగాణ ప్రాంత గోసేవ ప్రముఖ్ ఎస్.వి. నివాస్, జీ ఆరోగ్య విద్యా బోదన్ శ్రీరామ్ సుధాకర్, అనూప్ రాజా, మల్లారెడ్డి, శివకుమార్, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు గందె రాజ్ కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు వందనపు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News