Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:05 AM

సుస్థిర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి – ఆరుట్ల సురేష్ కుమార్

సుస్థిర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి – ఆరుట్ల సురేష్ కుమార్

సుస్థిర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి  – ఆరుట్ల సురేష్ కుమార్
January 12, 2026 06:15 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

సుస్థిర భవిష్యత్తు నిర్మాణానికి యువత బాధ్యతతో ముందుకు రావాలని చైతన్య భారతి ఫౌండేషన్ చైర్మెన్ ఆరుట్ల సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. దృఢచిత్తంతో, దేశాభివృద్ధి లక్ష్యంగా యువత పునరంకితమవ్వాల్సిన అవసరం ఉందన్నారు.స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని చైతన్య భారతి ఫౌండేషన్, వివేకానంద యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్‌లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచ వేదికపై చాటిన మహానుభావుడు స్వామి వివేకానందుడన్నారు. తన ప్రసంగాలు, బోధనలతో యువతలో చైతన్యం నింపిన స్ఫూర్తిప్రదాతగా ఆయన నిలిచారని పేర్కొన్నారు.యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడమే స్వామి వివేకానంద ఆశయమని తెలిపారు. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే దేశానికి సుస్థిర భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, తెలంగాణ ప్రాంత గోసేవ ప్రముఖ్ ఎస్.వి. నివాస్, జీ ఆరోగ్య విద్యా బోదన్ శ్రీరామ్ సుధాకర్, అనూప్ రాజా, మల్లారెడ్డి, శివకుమార్, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు గందె రాజ్ కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు వందనపు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News