సుస్థిర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి – ఆరుట్ల సురేష్ కుమార్
సుస్థిర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి – ఆరుట్ల సురేష్ కుమార్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి
సుస్థిర భవిష్యత్తు నిర్మాణానికి యువత బాధ్యతతో ముందుకు రావాలని చైతన్య భారతి ఫౌండేషన్ చైర్మెన్ ఆరుట్ల సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. దృఢచిత్తంతో, దేశాభివృద్ధి లక్ష్యంగా యువత పునరంకితమవ్వాల్సిన అవసరం ఉందన్నారు.స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని చైతన్య భారతి ఫౌండేషన్, వివేకానంద యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచ వేదికపై చాటిన మహానుభావుడు స్వామి వివేకానందుడన్నారు. తన ప్రసంగాలు, బోధనలతో యువతలో చైతన్యం నింపిన స్ఫూర్తిప్రదాతగా ఆయన నిలిచారని పేర్కొన్నారు.యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడమే స్వామి వివేకానంద ఆశయమని తెలిపారు. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే దేశానికి సుస్థిర భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, తెలంగాణ ప్రాంత గోసేవ ప్రముఖ్ ఎస్.వి. నివాస్, జీ ఆరోగ్య విద్యా బోదన్ శ్రీరామ్ సుధాకర్, అనూప్ రాజా, మల్లారెడ్డి, శివకుమార్, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు గందె రాజ్ కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు వందనపు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి