సూర్యాపేట మున్సిపాలిటీ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి
సూర్యాపేట మున్సిపాలిటీ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి
Biksham
46 వ వార్డు కౌన్సిలర్ గా మొరిశెట్టి నివేదిత లక్షాది ని గెలిపించాలి
సూర్యాపేట మున్సిపాలిటీ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి మొరిశెట్టి నివేదిత లక్షాధిని 46 వార్డులో భారీ మెజారిటితో గెలిపించాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణరెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని 46వ వార్డు గడపగడపకు ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట అభివృద్దికి తమ సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నిధులు ఎక్కువగా తెస్తామని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎఐ సిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ లు అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ ని గెలిచి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సూర్యాపేట కు నిధులు ఇచ్చే భాద్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోవాలని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ 46 వార్డు ప్రజలు తనకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. మనందరం ఐకమత్యంగా అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి పనిచేయాలని అన్నారు. 46 వ వార్డు ను ఆదర్శ వార్డు గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆదర్శ సుందరీకరమైన సూర్యాపేట గా మార్చుకోవడానికి అందరం కలిసి మొరిశెట్టి నివేదిత లక్షాది ని గెలిపిద్దామని పలువురు ప్రముఖులు తెలిపారు. 46 వార్డులో మొరిశెట్టి నివేదిత లక్షాది ని భారీ మెజారిటీగా గెలిపిద్దాం అని విద్యానగర్ 46 వ వార్డు లో జరిగిన ర్యాలి లో వార్డు ప్రజలు కాంగ్రెస్ నాయకులు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి