Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

సూర్యాపేట మున్సిపాలిటీ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి

సూర్యాపేట మున్సిపాలిటీ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి

సూర్యాపేట మున్సిపాలిటీ ని కాంగ్రెస్ పార్టీ  కైవసం చేసుకోవాలి
February 10, 2026 03:27 AM 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

46 వ వార్డు కౌన్సిలర్ గా మొరిశెట్టి నివేదిత లక్షాది ని గెలిపించాలి

సూర్యాపేట మున్సిపాలిటీ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి మొరిశెట్టి నివేదిత లక్షాధిని 46 వార్డులో భారీ మెజారిటితో గెలిపించాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణరెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని 46వ వార్డు గడపగడపకు ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట అభివృద్దికి తమ సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నిధులు ఎక్కువగా తెస్తామని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎఐ సిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ లు అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ ని గెలిచి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సూర్యాపేట కు నిధులు ఇచ్చే భాద్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోవాలని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ 46 వార్డు ప్రజలు తనకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. మనందరం ఐకమత్యంగా అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి పనిచేయాలని అన్నారు. 46 వ వార్డు ను ఆదర్శ వార్డు గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆదర్శ సుందరీకరమైన సూర్యాపేట గా మార్చుకోవడానికి అందరం కలిసి మొరిశెట్టి నివేదిత లక్షాది ని గెలిపిద్దామని పలువురు ప్రముఖులు తెలిపారు. 46 వార్డులో మొరిశెట్టి నివేదిత లక్షాది ని భారీ మెజారిటీగా గెలిపిద్దాం అని విద్యానగర్ 46 వ వార్డు లో జరిగిన ర్యాలి లో వార్డు ప్రజలు కాంగ్రెస్ నాయకులు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News