సూర్యాపేట ఎండ్లపల్లికి కొత్త అధ్యక్షుడు నియామకం
సూర్యాపేట ఎండ్లపల్లికి కొత్త అధ్యక్షుడు నియామకం
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
హైదరాబాద్లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న సమక్షంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జ్ వట్టి జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా ఎండ్లపల్లి గ్రామ అధ్యక్షుడిగా భూపతి జనార్ధన్ గౌడ్ను నియమించారు.ఈ సందర్భంగా పతంగి అమెంద్ర గౌడ్, మన్నే శ్రీను, బాకు జానయ్యలను వట్టి జానయ్య యాదవ్ పార్టీ కండువా కప్పి ఘనంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వట్టి జానయ్య యాదవ్ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రజల పక్షాన నిలిచే మార్గం నచ్చి పెద్ద ఎత్తున పార్టీలో చేరడం ఆనందకరమన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల సేవలో నిరంతరం ఉండాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేయడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బత్తిని భిక్షపతి గౌడ్, కొమిరిశెట్టి వెంకన్న, కొమిరిశెట్టి రవి, చెమబోని సూర్య, చెన్నోబోయిన శ్రీనివాస్ గౌడ్, పిండిప్రోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి