సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ముప్పై పోలీస్ చట్టం అమలు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ముప్పై పోలీస్ చట్టం అమలు
Biksham
పోలీసు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలకు నిషేధం
సూర్యాపేట
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ముప్పై పోలీస్ చట్టం అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవనానికి అంతరాయం కలిగించే సమావేశాలు, జన సమూహాలు పూర్తిగా నిషేధమని తెలిపారు.అదేవిధంగా సామాజిక మాధ్యమాలలో అనవసరమైన విషయాలు, అసత్య ప్రచారాలు చేసిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే ముప్పై పోలీస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.బాణసంచా కాల్చడం, డీజేలు వినియోగించడం కూడా పూర్తిగా నిషేధమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి