సంక్రాంతి వేళ గ్రామంలో క్రీడల సందడి… ఘనంగా బహుమతుల ప్రదానం
సంక్రాంతి వేళ గ్రామంలో క్రీడల సందడి… ఘనంగా బహుమతుల ప్రదానం
Editor Desk
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో వాలీబాల్, క్రికెట్ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పోటీలు గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించాయి.
వాలీబాల్ పోటీల్లో ప్రథమ బహుమతి విజేతలుగా నిలిచిన 7 హిల్స్ జట్టు సభ్యులకు రూ.5,000 నగదు బహుమతి తో పాటు షీల్డ్ అందజేశారు. ద్వితీయ బహుమతి పొందిన శ్రీ చత్రపతి శివాజీ యూత్ జట్టుకు రూ.2,500 నగదు బహుమతి, షీల్డ్ ప్రదానం చేశారు.
అదేవిధంగా క్రికెట్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన గల్లి బాయ్స్ యూత్ జట్టుకు రూ.10,000 నగదు బహుమతి, షీల్డ్ అందజేయగా, ద్వితీయ స్థానంలో నిలిచిన శ్రీ చత్రపతి శివాజీ యూత్ జట్టుకు రూ.5,000 నగదు బహుమతి, షీల్డ్ అందజేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కందిమళ్ళ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఇటీవల హాకీ విభాగంలో జాతీయస్థాయికి ఎంపికైన గ్రామ విద్యార్థి నోముల సాయి కుమార్ కు ప్రోత్సాహకంగా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కందిమళ్ళ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ…“గ్రామ యువత క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలి. భవిష్యత్తులో మరింత గొప్ప విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి. యువతకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి” అని భరోసా ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి