Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:48 AM

సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు

సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు

సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు
January 23, 2026 06:50 PM 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువును తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 21 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని యాదాద్రి జిల్లా మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యా సంస్థల సంఘం జిల్లా సమన్వయాధికారి మాధవి వెల్లడించారు.

గత నెల 11వ తేదీన ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఇప్పటివరకు లక్షా రెండు వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు తెలిపారు. పొడిగించిన గడువును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీ కోసం కూడా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు అన్నీ https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, సాధారణ సంక్షేమ నివాస విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News