Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:23 PM

సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు

సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు

సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు
January 23, 2026 06:50 PM 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువును తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 21 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని యాదాద్రి జిల్లా మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యా సంస్థల సంఘం జిల్లా సమన్వయాధికారి మాధవి వెల్లడించారు.

గత నెల 11వ తేదీన ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఇప్పటివరకు లక్షా రెండు వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు తెలిపారు. పొడిగించిన గడువును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీ కోసం కూడా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు అన్నీ https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, సాధారణ సంక్షేమ నివాస విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News