సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు
సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువును తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 21 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని యాదాద్రి జిల్లా మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యా సంస్థల సంఘం జిల్లా సమన్వయాధికారి మాధవి వెల్లడించారు.
గత నెల 11వ తేదీన ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఇప్పటివరకు లక్షా రెండు వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు తెలిపారు. పొడిగించిన గడువును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీ కోసం కూడా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు అన్నీ https://tgcet.cgg.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, సాధారణ సంక్షేమ నివాస విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి