సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల
సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించబడుతున్న దక్షిణ భారత దేశ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఈ నెల పదొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన వక్రతుండ మహాకాయ నృత్య ప్రదర్శనను ప్రదర్శించనున్నారు.ఈ నృత్య ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకత, సాంస్కృతిక ప్రతిభకు ప్రతీకగా నిలవనుంది. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెంచుకుంటూ శ్రమతో సాధన చేసిన విద్యార్థులు ఈ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించి వారిని ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుకుంటున్నాము.విద్యతో పాటు కళలు, సంస్కృతికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పాఠశాల ఆచార్య బృందం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి సిద్ధం చేసింది. విద్యార్థుల ప్రతిభకు మీ ప్రోత్సాహం, ఆశీర్వాదం ఎంతో అవసరం.
మీ
మన్మధ కిషోర్
ప్రధానోపాధ్యాయులు,ఇందులో చంద్ర శేఖర్ ఆచార్య,రాజ శేఖర్,ధన్సింగ్,జైపాల్ రెడ్డి,రాజయ్య ఉపాధ్యాయులు
జెడ్పీ ఉన్నత పాఠశాల, నారాయణఖేడ్

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి