Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:18 AM

సిటీ మోడల్ స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

సిటీ మోడల్ స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

సిటీ మోడల్ స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
21-02-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులే ఉపాధ్యాయులుగా ప్రతిభ చాటారు

చౌటుప్పల్ పట్టణంలోని సిటీ మోడల్ స్కూల్ లో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని, ఉపాధ్యాయుల పాత్రలను స్వీకరించి తరగతులను నిర్వహించారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత వైఖరి అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మారేపెల్లి గోదాదేవి పాల్గొని, స్వపరిపాలనలో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ముఖ్య బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులు సీఎం గా ఆనంద్, కలెక్టర్ సిహెచ్.హరిక, డీఈవో నవనీత, ఎంఈఓ జాహ్నవి,చైర్మన్ డి. వరుణ్,ప్రిన్సిపాల్ సిహెచ్.నవ్వశ్రీ, ఉపాధ్యాయిగా సంతోషి సాక్షి లు వ్యవహరించారు. నాయకత్వ వికాసానికి దోహదం స్వపరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ గుణాలు, బాధ్యతాభావం, సంఘటిత భావన పెంపొందుతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

Sthanikam

సిటీ మోడల్ స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

Article Image

విద్యార్థులే ఉపాధ్యాయులుగా ప్రతిభ చాటారు

చౌటుప్పల్ పట్టణంలోని సిటీ మోడల్ స్కూల్ లో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని, ఉపాధ్యాయుల పాత్రలను స్వీకరించి తరగతులను నిర్వహించారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత వైఖరి అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మారేపెల్లి గోదాదేవి పాల్గొని, స్వపరిపాలనలో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ముఖ్య బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులు సీఎం గా ఆనంద్, కలెక్టర్ సిహెచ్.హరిక, డీఈవో నవనీత, ఎంఈఓ జాహ్నవి,చైర్మన్ డి. వరుణ్,ప్రిన్సిపాల్ సిహెచ్.నవ్వశ్రీ, ఉపాధ్యాయిగా సంతోషి సాక్షి లు వ్యవహరించారు. నాయకత్వ వికాసానికి దోహదం స్వపరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ గుణాలు, బాధ్యతాభావం, సంఘటిత భావన పెంపొందుతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News